‘అమ్నెస్టీ’ పొడిగింపు లేదు..!
- June 08, 2024
కువైట్: క్షమాభిక్ష గడువు సమీపిస్తున్నందున పొడిగింపు లేదని అధికారులు ధృవీకరించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారందరినీ పట్టుకోవడానికి జూన్ 17 తర్వాత భారీ భద్రతా ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై, వారికి ఆశ్రయం కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ మజ్యాద్ అల్-ముతైరీ తెలిపారు. ఈ వ్యక్తులను కువైట్ నుండి బహిష్కరించడానికి మరియు వారి రీ-ఎంట్రీని నిషేధించడానికి సమగ్ర చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భద్రతా ఒప్పందాల ప్రకారం, నేరస్థులు కువైట్ మరియు GCCలో తిరిగి ప్రవేశించకుండా జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటారు. గడువు ముగియగానే ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తారమని బ్రిగేడియర్ జనరల్ అల్-ముతైరీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!
- ఖతార్లో నెలరోజుల్లో QR18.626 బిలియన్ల లావాదేవీలు..!!
- సౌదీ అరేబియాలో భూకంపం.. యూఏఈలో ప్రభావమెంతంటే?
- కువైట్ లో వేర్వేరు కేసుల్లో ఆరుగురి అరెస్ట్..!!
- రియాద్ ఎక్స్పో 2030.. కింగ్ హమద్ కు ఆహ్వానం..!!
- రోడ్డుపై ట్రక్కు బోల్తా..ప్రయాణికులకు అలెర్ట్..!!
- Insta TV యాప్ను విడుదల చేసిన మెటా
- WPL 2026 షెడ్యూల్ విడుదల..







