‘అమ్నెస్టీ’ పొడిగింపు లేదు..!
- June 08, 2024
కువైట్: క్షమాభిక్ష గడువు సమీపిస్తున్నందున పొడిగింపు లేదని అధికారులు ధృవీకరించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారందరినీ పట్టుకోవడానికి జూన్ 17 తర్వాత భారీ భద్రతా ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై, వారికి ఆశ్రయం కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ మజ్యాద్ అల్-ముతైరీ తెలిపారు. ఈ వ్యక్తులను కువైట్ నుండి బహిష్కరించడానికి మరియు వారి రీ-ఎంట్రీని నిషేధించడానికి సమగ్ర చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భద్రతా ఒప్పందాల ప్రకారం, నేరస్థులు కువైట్ మరియు GCCలో తిరిగి ప్రవేశించకుండా జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటారు. గడువు ముగియగానే ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తారమని బ్రిగేడియర్ జనరల్ అల్-ముతైరీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







