‘అమ్నెస్టీ’ పొడిగింపు లేదు..!
- June 08, 2024
కువైట్: క్షమాభిక్ష గడువు సమీపిస్తున్నందున పొడిగింపు లేదని అధికారులు ధృవీకరించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారందరినీ పట్టుకోవడానికి జూన్ 17 తర్వాత భారీ భద్రతా ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై, వారికి ఆశ్రయం కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ మజ్యాద్ అల్-ముతైరీ తెలిపారు. ఈ వ్యక్తులను కువైట్ నుండి బహిష్కరించడానికి మరియు వారి రీ-ఎంట్రీని నిషేధించడానికి సమగ్ర చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భద్రతా ఒప్పందాల ప్రకారం, నేరస్థులు కువైట్ మరియు GCCలో తిరిగి ప్రవేశించకుండా జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటారు. గడువు ముగియగానే ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తారమని బ్రిగేడియర్ జనరల్ అల్-ముతైరీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..