సౌదీ అరామ్కో తుది ఆఫర్ ధర..షేరుకు SR27.25
- June 08, 2024
రియాద్: సౌదీ అరామ్కో సాధారణ షేర్ల సెకండరీ పబ్లిక్ ఆఫర్కు తుది ఆఫర్ ధర ఒక్కో షేరుకు SR27.25గా నిర్ణయించారు. ఇది బుక్బిల్డింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అమల్లోకి రానుంది. ఈ ఆఫర్లో 1.545 బిలియన్ షేర్ల సెకండరీ పబ్లిక్ ఆఫర్ను కలిగి ఉంది. ఇది కంపెనీ జారీ చేసిన షేర్లలో సుమారు 0.64% కు సమానం. చివరి ఆఫర్ ధర సంస్థాగత , రిటైల్ పెట్టుబడిదారులకు సమానంగా ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక్కొక్కరికి కనీసం 10 షేర్లను అందుకుంటారు. మిగిలిన షేర్లు ప్రో-రేటా ప్రాతిపదికన కేటాయించబడతాయి. ఫలితంగా సగటు కేటాయింపు కారకం దాదాపు 25.13% గా ఉంటుంది. రిటైల్ ఆఫర్ ను 1,331,915 మంది సబ్స్క్రైబర్లను ఆకర్షించగా, ఆఫర్ చేసిన షేర్లలో 10% రిటైల్ పెట్టుబడిదారులకు కేటాయించనున్నారు. మిగిలిన 90% సంస్థాగత పెట్టుబడిదారులకు కేటాయిస్తారు. 10% వరకు తుది ఆఫర్ ధర వద్ద కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించనున్నారు. ఓవర్-అలాట్మెంట్ ఆప్షన్ లేదా "గ్రీన్షూ" అని పిలువబడే ఈ ఎంపికను సౌదీ ఎక్స్ఛేంజ్లో ట్రేడింగ్ ప్రారంభించిన 30 రోజులలోపు పూర్తిగా లేదా పాక్షికంగా అమలు చేయవచ్చు. ఇది జూన్ 9 న ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







