చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంపై సిఎస్ సమీక్ష
- June 09, 2024
విజయవాడ: ఈనెల 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపధ్యంలో శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
ఈ సమావేశంలో సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, రాష్ట్ర గవర్నర్ సహా పలువురు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారని, కావున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అలాగే విస్తృత మైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
గన్నవరం విమానాశ్రయంలో వివిఐపిలు,విఐపిలు తదితర ప్రముఖుల విమానాలు, హెలికాప్టర్లకు తగిన పార్కింగ్ కు తగిన ఏర్పాట్లు చేయాలని ఎయిర్ అధికారులను సిఎస్ ఆదేశించారు. అలాగే ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే కేంద్ర, రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, తదితర వాహనాల పార్కింగ్ కు తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంకా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఇతర అంశాలపై సిఎస్ సమీక్షించారు.
డిజిపి హరీశ్ కుమార్ గుప్త మాట్లాడుతూ విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. అదే విధంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారి వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శులు యం.రవిచంద్ర, శశి భూషణ్ కుమార్, అదనపు డిజిపి ఎస్.బాగ్చి, టిఆర్ అండ్బి కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న, పౌరసరఫరాలు, ఉద్యానవన శాఖల కమీషనర్లు అరుణ్ కుమార్, శ్రీధర్, సిఆర్డిఏ కమీషనర్ వివేక్ యాదవ్, ఎపి జెన్కో సిఎండి చక్రధర్ బాబు పాల్గొన్నారు.
ఇంకా ఏలూరు రేంజ్ డిఐజి అశోక్ కుమార్,సివిల్ కార్పొరేషన్ ఎండి వీరపాండ్యన్ కృష్ణా, ఎన్టిఆర్ జిల్లాల కలెక్టర్లు డికె బాలాజీ,డిల్లీ రావు, విజయవాడ పోలీస్ కమీషనర్ పిహెచ్ డి రామకృష్ణ,డిఐజి రాజశేఖర్ బాబు,డైరెక్టర్ ఫైర్ సర్వీసెస్ రమణ,మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్, ఎన్టిఆర్ జిల్లా జెసి సంపత్ కుమార్,కృష్ణా జిల్లా ఎస్పి ఎ.నయీమ్ హస్మి,గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి,అండ్ పిఆర్ అదనపు డైరైక్టర్ ఎల్.స్వర్ణ లత, ఎంఎల్ సి అశోక్ బాబు తదితర ప్రజా ప్రతినిధులు,వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు..
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







