క్లాస్ చిలిమా మరణం పై సుల్తాన్ సంతాపం
- June 12, 2024
మస్కట్: మలావి రిపబ్లిక్ వైస్ ప్రెసిడెంట్ హిస్ ఎక్సలెన్సీ సౌలోస్ క్లాస్ చిలిమా మరణంపై హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సంతాపం తెలియజేసారు. ఈ మేరకు మలావి రిపబ్లిక్ ప్రెసిడెంట్ హిస్ ఎక్సెలెన్సీ డాక్టర్ లాజరస్ చక్వేరాకు సంతాప సందేశాన్ని పంపారు. మలావి ప్రజలకు మరియు బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
మలావీ వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ క్లాస్ చిలిమా మరియు మాజీ ప్రథమ మహిళ షానిల్ డిజింబిరితో సహా మరో తొమ్మిది మంది వారు ప్రయాణిస్తున్న సైనిక విమానం కూలిపోవడంతో మరణించినట్లు అధ్యక్షుడు లాజరస్ చక్వేరా మంగళవారం తెలిపారు. విమానం సోమవారం ఉదయం 09:17 గంటలకు (0717 GMT) రాజధాని లిలాంగ్వే నుండి బయలుదేరింది. అయితే 10:02 గంటలకు షెడ్యూల్ ప్రకారం Mzuzu విమానాశ్రయంలో అది ల్యాండ్ కాలేదు. విమానంలో ఉన్న ప్రయాణీకులందరూ మరణించారని, మిలటరీ వారి అవశేషాలను తిరిగి రాజధానికి తీసుకువస్తోందని చక్వేరా చెప్పారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









