జెడ్డాలో భవనం కూలి ఏడుగురు మృతి..పలువురు అరెస్ట్
- June 15, 2024
జెడ్డా: జెడ్డాలో నివాస భవనం కూలిన ఘటనకు సంబంధించి అనేక మంది వ్యక్తులను అరెస్టు చేసినట్టు సౌదీ అరేబియా పర్యవేక్షణ మరియు అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) వెల్లడించింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించారని, మరో ఎనిమిది మందికి గాయాలు అయినట్లు తెలిపారు. మే 30 న జెద్దాలోని అల్-ఫైసాలియా పరిసరాల్లో నివాస భవనం కూలిపోవడంతో ఏడుగురు చనిపోగా, ఎనిమిది మంది గాయపడిన ఘటనపై అధికార యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది. భవన నిర్మాణ అనుమతుల జారీలో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నట్లు సమాచారం అందడంతో విచారణ చేపట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు మక్కా ప్రాంతానికి చెందిన ఎమిర్ ఏర్పాటు చేసిన కమిటీతో నజాహా అధికారులు విచారణ చేస్తున్నారు. భవనంలో సాంకేతిక లోపాలున్నట్లు విచారణలో తేలింది. మునిసిపాలిటీ భవన యజమాని ఫిరాస్ హనీ అల్ తుర్కీ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలోని భాగస్వామ్య సేవల డిప్యూటీ మంత్రిని నిర్మాణాన్ని నిలిపివేయమని ఆదేశించింది. కానీ అతను నిబంధనలు పాటించకుండా నిర్మాణం చేపట్టడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వ్యక్తులందరినీ అదుపులోకి తీసుకున్నామని, వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని నజహా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







