జెడ్డాలో భవనం కూలి ఏడుగురు మృతి..పలువురు అరెస్ట్

- June 15, 2024 , by Maagulf
జెడ్డాలో భవనం కూలి ఏడుగురు మృతి..పలువురు అరెస్ట్

జెడ్డా: జెడ్డాలో నివాస భవనం కూలిన ఘటనకు సంబంధించి అనేక మంది వ్యక్తులను అరెస్టు చేసినట్టు సౌదీ అరేబియా పర్యవేక్షణ మరియు అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) వెల్లడించింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించారని, మరో ఎనిమిది మందికి గాయాలు అయినట్లు తెలిపారు.  మే 30 న జెద్దాలోని అల్-ఫైసాలియా పరిసరాల్లో నివాస భవనం కూలిపోవడంతో ఏడుగురు చనిపోగా, ఎనిమిది మంది గాయపడిన ఘటనపై అధికార యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది. భవన నిర్మాణ అనుమతుల జారీలో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నట్లు సమాచారం అందడంతో విచారణ చేపట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు మక్కా ప్రాంతానికి చెందిన ఎమిర్ ఏర్పాటు చేసిన కమిటీతో నజాహా అధికారులు విచారణ చేస్తున్నారు.  భవనంలో సాంకేతిక లోపాలున్నట్లు విచారణలో తేలింది. మునిసిపాలిటీ భవన యజమాని ఫిరాస్ హనీ అల్ తుర్కీ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలోని భాగస్వామ్య సేవల డిప్యూటీ మంత్రిని నిర్మాణాన్ని నిలిపివేయమని ఆదేశించింది. కానీ అతను నిబంధనలు పాటించకుండా నిర్మాణం చేపట్టడంతో విషాదం చోటుచేసుకుంది.  ఈ ఘటనకు సంబంధించి వ్యక్తులందరినీ అదుపులోకి తీసుకున్నామని, వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని నజహా అధికారులు తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com