గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న సంక్షేమం కోసం తెలంగాణ ఎన్నారై పాలసీ.
- June 11, 2016
ఉపాధి కోసం రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న యువత సంక్షేమం కోసం తెలంగాణ ఎన్నారై పాలసీని రూపొందించాలని ఐటీ, మున్సిపల్, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. ఇందుకు ఇతర రాష్ట్రాల్లో అమ లుచేస్తున్న పాలసీలను అధ్యయనం చేయాలన్నారు. కేరళ, పంజాబ్లలో ఉన్న ఎన్నారై పాలసీలను పరిశీలించిన కేటీఆర్... అందులోని ప్రధానాంశాలను తెలంగాణ పాలసీలో స్వీకరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలి స్తున్నామన్నారు. జిల్లాల నుంచి గల్ఫ్కు వలస వెళ్లే యువతకు మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా పాలసీ ఉంటుందన్నారు.
వారంలో ఎన్నారై సంఘాలు, గల్ఫ్ దేశాల్లో ఎన్నారైల సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలతో మంత్రి సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశానికి హాజరు కావాలని కార్మిక, ఇతర శాఖల అధికారులను కేటీఆర్ ఆదేశించారని శనివారం ఆయన కార్యాలయం ప్రకటనలో తెలిపింది. విదేశాల్లో ప్రమాదాలకు గురైన వారికి, మరణించిన వారికి అందాల్సిన సాయంపై ఈ భేటీలో చర్చించనున్నారు.
దీంతోపాటు ఎన్నారైల నుంచి వచ్చే పెట్టుబడులు, ఇతర సహాయ సహకారాలను స్వీకరించేందుకు ఓ వ్యవస్థను సైతం ఈ పాలసీ ద్వారా ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నారైల సంక్షేమం కోసం దేశ విదేశాల్లో పనిచేస్తున్న సంస్థల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. ముసాయిదా పాలసీ సిద్ధమయ్యాక సీఎం సూచనలతో సాధ్యమైనంత త్వరగా తుది పాలసీని ప్రకటిస్తామన్నారు.
నేడు నగరానికి: అమెరికా పర్యటన ముగించుకున్న కేటీఆర్ ఆదివారం నగరానికి వస్తున్నారు. తెల్లవారుజాము 3 గంటలకు ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొంటారని మంత్రి కార్యాలయం శని వారం తెలిపింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









