వాట్సాప్ గ్రూపు ద్వారా ఏఏ మొక్కలు, ఎక్కడెక్కడ నాటాలి...
- June 12, 2016
రంగారెడ్డి జిల్లా బాచుపల్లి పంచాయతీలోని హరితవనం కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వివేకానంద ఆదివారం ప్రారంభించారు. ట్రీయిజం సంస్థ ఆధ్వర్యంలో 'ఈనాడు-ఈటీవీ తెలంగాణ' సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీవాసులు ఇంటికో మొక్క చొప్పున నాటాలని 15 రోజుల క్రితం నిర్ణయించారు. వాట్సాప్ గ్రూపు ద్వారా ఏఏ మొక్కలు, ఎక్కడెక్కడ నాటాలి... పర్యవేక్షణ ఎవరికి అప్పగించాలనే అంశాలపై అభిప్రాయ సేకరణ చేశారు. కాలనీ ప్రధాన రహదారిలో విద్యుత్స్తంబాల తీగల కింద పూలు, అలంకరణ మొక్కలు.. స్తంబాలు లేని చోట పొడవుగా పెరిగే మొక్కలు నాటాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా ఆదివారం ఆయా మొక్కలు నాటి వాటికి ట్రీగార్డులు కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఆయా మొక్కల సంరక్షణ కోసం జియో ట్యాగింగ్ ద్వారా అనుసంధానం చేస్తామన్నారు. మొక్క ట్రీగార్డుకు పర్యవేక్షణదారు ఫొటోను అతికిస్తారు. ఉత్తమంగా మొక్కలు సంరక్షించిన వారికి బహుమతులు కూడా ఇస్తామని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ.. నియోజకవర్గంలో లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో చిన్నారులు, మహిళలు సైతం భాగస్వాములయ్యారు. కార్యక్రమంలో సర్పంచి ఆగం పాండు, కాలనీ అసోసియేషన్ నేతలు దీపక్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం









