వేసవి సెలవులు ముగియనుండటంతో భక్తులు భారీగా..

- June 12, 2016 , by Maagulf
వేసవి సెలవులు ముగియనుండటంతో భక్తులు భారీగా..

భద్రాచలం పుణ్యక్షేత్రం ఆదివారం భక్తుల రామనామ స్మరణతో మారుమ్రోగింది. వారాంతపు సెలవులతో పాటు వేసవి సెలవులు ముగియనుండటంతో రామయ్య దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి 3గంటల సమయం పడుతోంది. నిత్యకల్యాణంతో పాటు ఆలయపండితులు సీతారాముల మూలవరులకు స్వర్ణపుష్పార్చన, ప్రత్యేక పంచామృతాభిషేకాలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com