నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టిన రోజు

- June 20, 2024 , by Maagulf
నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టిన రోజు

న్యూ ఢిల్లీ: నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు జూన్ 20, 1958. ద్రౌపదీ 1997 మొదట భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చి రాయ్‌రంగపూర్ పంచాయితీ కౌన్సిలర్‌గా ఎన్నికైంది.

1983 వరకు నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేసింది. ఆ తర్వాత ఉపాధ్యాయురాలిగా కూడా చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2000లో మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఆ తర్వాత ఎన్నో పధవుల్లో ఆమె తన నిజాయితీని నిరూపించుకుని రాజకీయాల్లోనే కొనసాగారు. ద్రౌపది ముర్ము 2022లో జరిగిన భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి గా పోటీ చేసి గెలిచి మొట్టమొదటి గిరిజన మహిళా రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించింది. 2022 జూలై 18న ఓట్లు జరగ్గా.. ఇందులో ఆమె అందరికంటే ఎక్కువ 2,824 ఓట్లు సంపాదించి మొదటి ప్రాధాన్యతను దక్కించుకుని గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే నేడు ద్రౌపది ముర్ము పుట్టిన రోజు అని తెలియడంతో చాలా మంది సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతూ.. పలు పోస్టులు పెడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com