అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించిన రాచకొండ పోలీస్
- June 20, 2024
హైదరాబాద్: రాచకొండ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో విధులు నిర్వహిస్తూ పాన్ ఇండియా నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో మూడు బంగారు పతకాలు సాధించిన హెడ్ కానిస్టేబుల్ అంబోజు అనిల్ కుమార్ ను రాచకొండ కమీషనర్ తరుణ్ జోషి నేరెడ్ మెట్ లోని రాచకొండ కమిషనర్ కార్యాలయంలో అభినందించారు. వీటితో పాటు ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి 25 తేదీలలో థాయ్ లాండ్ దేశములో జరిగిన 28వ ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2024 (AMA) లో 45 సంవత్సరముల విభాములో నాలుగు పతకాలు (1 బంగారు పతకం, 3 కాంస్య పతకాలు) అనిల్ కుమార్ సాధించడం జరిగింది. అందులో 4×400 మీటర్ల రిలేలో ఒక బంగారు పతకం మరియు 800 మీటర్లు, 1500 మీటర్లు, 5000 మీటర్ల పరుగుపందెంలో కాంస్య పతకాలు సాధించడం జరిగింది.త్వరలో సెప్టెంబరులో ఆస్ట్రేలియాలో జరుగనున్న అంతర్జాతీయ పోటీలలో పాల్గొంటున్న సందర్భంగా పోలీసు శాఖ తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని కమీషనర్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సిహెచ్ శ్రీకాంత్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్









