అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించిన రాచకొండ పోలీస్
- June 20, 2024
హైదరాబాద్: రాచకొండ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో విధులు నిర్వహిస్తూ పాన్ ఇండియా నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో మూడు బంగారు పతకాలు సాధించిన హెడ్ కానిస్టేబుల్ అంబోజు అనిల్ కుమార్ ను రాచకొండ కమీషనర్ తరుణ్ జోషి నేరెడ్ మెట్ లోని రాచకొండ కమిషనర్ కార్యాలయంలో అభినందించారు. వీటితో పాటు ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి 25 తేదీలలో థాయ్ లాండ్ దేశములో జరిగిన 28వ ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2024 (AMA) లో 45 సంవత్సరముల విభాములో నాలుగు పతకాలు (1 బంగారు పతకం, 3 కాంస్య పతకాలు) అనిల్ కుమార్ సాధించడం జరిగింది. అందులో 4×400 మీటర్ల రిలేలో ఒక బంగారు పతకం మరియు 800 మీటర్లు, 1500 మీటర్లు, 5000 మీటర్ల పరుగుపందెంలో కాంస్య పతకాలు సాధించడం జరిగింది.త్వరలో సెప్టెంబరులో ఆస్ట్రేలియాలో జరుగనున్న అంతర్జాతీయ పోటీలలో పాల్గొంటున్న సందర్భంగా పోలీసు శాఖ తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని కమీషనర్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సిహెచ్ శ్రీకాంత్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







