ఈ-స్కూటర్, సైకిల్ ప్రమాదాల్లో నలుగురు మృతి, 25 మందికి గాయాలు
- June 21, 2024
దుబాయ్: ఈ ఏడాది ప్రథమార్థంలో ఈ-స్కూటర్లు, సైకిళ్లతో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. అలాగే 25 మంది గాయపడినట్లు పోలీసులు నమోదు చేశారు. 2024 మొదటి ఆరు నెలల్లో 7,800 ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేశామని, 4,474 ఈ-స్కూటర్లు మరియు సైకిళ్లను జప్తు చేశామని చెప్పారు. దుబాయ్లో ప్రతిరోజూ సుమారు 43 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. 24 ఇ-స్కూటర్లు లేదా సైకిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఆపరేషన్స్ అఫైర్స్ అసిస్టెంట్ కమాండెంట్ మేజర్-జనరల్ అబ్దుల్లా అలీ అల్ ఘైతి మాట్లాడుతూ.. ఇ-స్కూటర్లు మరియు సైకిళ్ల వల్ల కలిగే "ముఖ్యమైన నష్టాలను" హైలైట్ చేసారు. 60kmph కంటే ఎక్కువ వేగ పరిమితి ఉన్న రోడ్లపై ప్రయాణించడం, ఇ-స్కూటర్లపై ప్రయాణికులను తీసుకెళ్లడం వంటి ఉల్లంఘనలకు Dh300 వరకు జరిమానాలు వర్తిస్తాయని తెలిపారు. నిర్ణీత దారులకు కట్టుబడి ఉండాలని, తగిన దుస్తులు మరియు హెల్మెట్లను ధరించాలని, రాత్రి సమయంలో లేదా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రైడింగ్కు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. నివాసితులు తమ యాప్ లేదా 901 ద్వారా ఉల్లంఘనలను పోలీసులకు నివేదించాలని కోరారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







