అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సిపి తరుణ్ జోషి
- June 21, 2024
హైదరాబాద్: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబర్ పేట సిఎఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, యోగా అనేది ప్రపంచానికి భారత దేశం అందించిన గొప్ప బహుమతి అని పేర్కొన్నారు.యోగా సాధన వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు.శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసుశాఖలో తీవ్రమైన ఒత్తిడి మధ్య అహర్నిశలు పనిచేసే సిబ్బందికి యోగా సాధన ఎంతో ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు మరియు సిబ్బంది తమ వీలును బట్టి తప్పనిసరిగా యోగా సాధన చేయాలని సూచించారు.
రాచకొండ డిసిపిలు, అదనపు డిసిపిలు మరియు హెడ్ క్వార్టర్స్ లోని పలు స్థాయిల అధికారులు మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో యోగా సాధన చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







