అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సిపి తరుణ్ జోషి
- June 21, 2024
హైదరాబాద్: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబర్ పేట సిఎఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, యోగా అనేది ప్రపంచానికి భారత దేశం అందించిన గొప్ప బహుమతి అని పేర్కొన్నారు.యోగా సాధన వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు.శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసుశాఖలో తీవ్రమైన ఒత్తిడి మధ్య అహర్నిశలు పనిచేసే సిబ్బందికి యోగా సాధన ఎంతో ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు మరియు సిబ్బంది తమ వీలును బట్టి తప్పనిసరిగా యోగా సాధన చేయాలని సూచించారు.
రాచకొండ డిసిపిలు, అదనపు డిసిపిలు మరియు హెడ్ క్వార్టర్స్ లోని పలు స్థాయిల అధికారులు మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో యోగా సాధన చేయడం జరిగింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్..
- 17 మంది ప్రాణాలు తీసిన ఏసీ కంప్రెషర్!
- మిస్ వరల్డ్ కంటెస్టంట్లను అలరించిన సెక్రటేరియట్ డ్రోన్ షో
- కారు డోర్ లాక్–నలుగురు చిన్నారులు మృతి
- తన ఆత్మకథ పుస్తకావిష్కరణకు రావలసిందిగా రేవంత్,చంద్రబాబు కు బండారు దత్తాత్రేయ ఆహ్వానం
- త్వరలో తిరుపతిలో ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్
- ఐపీఎల్ అభిమానులకు జైన్ కువైట్ బంపరాఫర్.. KD1కే స్ట్రీమింగ్ ఆఫర్..!!
- గ్యాస్ సిలిండర్ పేలి కుప్పకూలిన భవనం.. భారతీయ దంపతులు మృతి..!!
- మస్కట్లో భారతీయుడు సహా నలుగురు శ్రీలంక ప్రవాసులు అరెస్ట్.. !!
- ట్రంప్ మిడ్ ఈస్ట్ పర్యటన: $2 ట్రిలియన్లకు పైగా బిజినెస్ ఒప్పందాలు..!!