అమెరికాలో తెలుగు యువకుడు దుర్మరణం
- June 23, 2024
అమెరికా: అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. దండగుడు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు చెందిన యువకుడు మృతిచెందాడు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలికి చెందిన దాసరి గో్పీకృష్ణ (32) అమెరికాలో ఎంఎస్ పూర్తి చేశాడు. పది నెలల క్రితంమే సాప్ట్ వేర్ ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాడు. జాబ్ ప్రయత్నంలో ఉండగానే.. సౌత్ ఆర్కెన్సాస్ లోని ఓ సూపర్ మార్కెట్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ సూపర్ మార్కెట్ లోని కౌంటర్ లో ఉండగా.. ఓ దుండగుడు వచ్చి అతనిపై కాల్పులు జరిపాడు. దీంతో గోపీకృష్ణ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
కాల్పులు అనంతరం దుండగుడు సూపర్ మార్కెట్ లోని వస్తువులను తీసుకొని పరారయ్యాడు. తీవ్ర గాయాలతో పడిఉన్న గోపీకృష్ణను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గోపీకృష్ణ మృతిచెందాడు. ఈ సమాచారం తెలుసుకున్న గోపీకృష్ణ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అమెరికాలోని తానా అసోసియేషన్ ద్వారా మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఇదిలాఉంటే.. దుకాణం లోపలేకాక పార్కింగ్ స్థలంలోను దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో మరో ముగ్గురు వ్యక్తులు మరణించారు. తొమ్మిది మందికి గాయాలయ్యాయి. కాల్పులకు సంబంధించిన సీసీ ఫుటేజీలు వెలుగులోకి వచ్చాయి.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







