ISRO: పుష్పక్ రాకెట్ ప్రయోగం సక్సెస్..
- June 23, 2024
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో ఘనత సాధించింది.స్వదేశీ అంతరిక్ష నౌకగా పిలుచుకునే పుష్పక్ రాకెట్ ను విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ATR) నుంచి ఎస్యూవీ తరహా రాకెట్ను ప్రయోగించారు. గాలిలోకి ఎగిరిన తర్వాత రాకెట్ రన్వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. రీయూజబుల్ లాంచ్ వెహికల్ తయారీ భారతదేశ చరిత్రలో మరో మైలురాయి అని ఇస్రో పేర్కొంది. ప్రయోగంలో భాగంగా ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ నుంచి పుష్పక్ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించినట్లు ఇస్రో ప్రకటించింది. ఈ మేరకు వెల్లడించారు.
‘ఇస్రో మరో ఘనత సాధించింది..రీయూజబుల్ లాంఛింగ్ వెహికిల్ టెక్నాలజీతో తయారు చేసిన పుష్పక్ రాకెట్ని విజయవంతంగా ప్రయోగించాం.గాల్లో నుంచి వదిలిన సమయంలో నిర్దేశించిన విధంగానే రన్వైపే సురక్షితంగా ల్యాండ్ అయింది. భారత వాయుసేన హెలికాప్టర్ చినూక్ ద్వారా పైకి తీసుకెళ్లి 4.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి వదిలి పెట్టింది.ఈ సమయంలో 4 కి.మీ దూరం నుంచి పుష్పక్ రాకెట్ రన్వే వైపు దూసుకొచ్చింది.రేంజ్ని కూడా తనకు తానుగానే సరిచూసుకుని ఆ తరవాత రన్వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. బ్రేక్ పారాచ్యూట్, ల్యాండింగ్ గేర్ బ్రేక్లు, నోస్ వీల్ స్టీరింగ్ వ్యవస్థ సాయంతో ఆగిపోయింది.’ అంటూ ఇస్రో పేర్కొంది.
RLV-Lexలో బహుళ-సెన్సార్ ఫ్యూజన్ ఉపయోగించారు. ఇందులో ఇనర్షియల్ సెన్సార్, రాడార్ ఆల్టిమీటర్, ఫ్లష్ ఎయిర్ డేటా సిస్టమ్, సూడోలైట్ సిస్టమ్, నావిగేషన్ సిస్టమ్ వంటి సెన్సార్లు ఉన్నాయి. ఈ మిషన్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నేతృత్వంలోని సహకార ప్రయత్నం, ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్, ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్వర్క్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉన్నాయి.ఈ మిషన్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఏరియల్ డెలివరీ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, మిలిటరీ ఎయిర్వర్తినెస్ అండ్ సర్టిఫికేషన్ సెంటర్ కింద ప్రాంతీయ మిలిటరీ ఎయిర్వర్థినెస్ సెంటర్లు, నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఓస్ట్రోల్ పార్ట్నర్ కార్పొరేషన్ సమన్వయం చేస్తోంది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి గణనీయమైన మద్దతు లభించింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







