రష్యాలో ఉగ్రవాదుల నరమేధం..
- June 24, 2024
రష్యాలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. డాగేస్తాన్ ప్రావిన్స్ మఖచ్కలా ప్రాంతంలో చర్చిలు, ప్రార్థనా మందిరాలు, పోలీస్ పోస్ట్ పై ఏకకాలంలో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో 15మందికిపైగా మరణించారు. రష్యన్ గార్డ్స్లోని బీటీఆర్-80 స్పెషల్ ఫోర్సెస్ రంగంలోకిదిగి ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చారు. ఉగ్రదాడిలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
ఉగ్రదాడి పై డాగేస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ.. డెర్బెంట్ లోని ప్రార్థనా మందిరం, చర్చిపై ఉగ్రవాద బృందాలు కాల్పులు జరిపారని తెలిపారు. చర్చి, ప్రార్థనా మందిరం రెండింటినీ తగులబెట్టినట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో పోలీసులు, పౌరులు, ఒక మతగురువు ఉన్నారు. ఈ విషయాన్ని డాగేస్తాన్ గవర్నర్ సెర్గీ మెలికోవ్ తెలిపారు. ఓ చర్చిలో ప్రజల్ని బందీలుగా చేసుకున్నట్టు తొలుత వార్తలు వచ్చాయి. బందీలు చేసుకోలేదని డాగస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రవాదుల నుంచి తప్పించుకోవడం కోసం ప్రజలు తమంతటతామే లాక్ చేసుకున్నారని వెల్లడించారు.
ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉండే డాగేస్తాన్ ప్రాంతంలో ఈ దాడి జరిగిందని, గతంలోనూ ఈ ప్రాంతానికి సాయుధ తిరుగుబాటు చరిత్ర ఉందని రష్యా ఉగ్రవాద నిరోధక కమిటీ ప్రకటించింది. దీన్ని తీవ్రవాద దుశ్చర్యగా అభివర్ణించింది. మూడు రోజులు సంతాప దినాలుగా రాష్యా అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- ఏసీ పేలడం తో 8 మంది మృతి...
- మే నెల 14-16 తేదీల మధ్య అండమాన్ కు తాకనున్న నైరుతి రుతుపవనాలు
- 'సేవే పరమ ధర్మం' స్పూర్తితో వైద్యులు సేవలందించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులే..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ప్రభుత్వ సంస్థల పేర్ల వాడకం పై నిషేధం..!!
- ఒమన్లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నమోదు..!!
- న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!









