రష్యాలో ఉగ్రవాదుల నరమేధం..
- June 24, 2024
రష్యాలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. డాగేస్తాన్ ప్రావిన్స్ మఖచ్కలా ప్రాంతంలో చర్చిలు, ప్రార్థనా మందిరాలు, పోలీస్ పోస్ట్ పై ఏకకాలంలో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో 15మందికిపైగా మరణించారు. రష్యన్ గార్డ్స్లోని బీటీఆర్-80 స్పెషల్ ఫోర్సెస్ రంగంలోకిదిగి ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చారు. ఉగ్రదాడిలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
ఉగ్రదాడి పై డాగేస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ.. డెర్బెంట్ లోని ప్రార్థనా మందిరం, చర్చిపై ఉగ్రవాద బృందాలు కాల్పులు జరిపారని తెలిపారు. చర్చి, ప్రార్థనా మందిరం రెండింటినీ తగులబెట్టినట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో పోలీసులు, పౌరులు, ఒక మతగురువు ఉన్నారు. ఈ విషయాన్ని డాగేస్తాన్ గవర్నర్ సెర్గీ మెలికోవ్ తెలిపారు. ఓ చర్చిలో ప్రజల్ని బందీలుగా చేసుకున్నట్టు తొలుత వార్తలు వచ్చాయి. బందీలు చేసుకోలేదని డాగస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రవాదుల నుంచి తప్పించుకోవడం కోసం ప్రజలు తమంతటతామే లాక్ చేసుకున్నారని వెల్లడించారు.
ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉండే డాగేస్తాన్ ప్రాంతంలో ఈ దాడి జరిగిందని, గతంలోనూ ఈ ప్రాంతానికి సాయుధ తిరుగుబాటు చరిత్ర ఉందని రష్యా ఉగ్రవాద నిరోధక కమిటీ ప్రకటించింది. దీన్ని తీవ్రవాద దుశ్చర్యగా అభివర్ణించింది. మూడు రోజులు సంతాప దినాలుగా రాష్యా అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







