తెలుగు ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త

- June 24, 2024 , by Maagulf
తెలుగు ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త

తెలుగు ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు చెప్పింది. విశాఖపట్నం-లింగంపల్లి (12805), లింగంపల్లి-విశాఖపట్నం (12806) మధ్య జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. నిడదవోలు-కడియం సెక్షన్‌ మధ్య ఆధునికీకరణ పనులు నేపథ్యంలో జూన్ 23 నుంచి ఆగస్టు 11 వరకు జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్ తదితర ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేయగా.. స్పందించిన అధికారులు జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 25 నుంచి మళ్లీ యథావిధిగా నడిపించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com