పావురం సాహసం
- July 03, 2015
పూర్వం గోదావరి ఒడ్డున ఒక పురాతన దేవాలయం ఉండేది. దాని గోపుర ద్వారంలో అనేక రకాల పక్షులు నివసిస్తూ ఉండేవి. అదే గోపురం వద్ద ఒక పావురాల జంట కూడా ఉండేది. ఆ జంట పావురాలలో ఆడపావురం కొంత ముందు జాగ్రత్త కలది. మగపావురం మాత్రం అస్సలు జాగ్రత్త లేకుండా ప్రమాదం పొంచి వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకుంటుంది. ఇలా ఉండగా ఒకరోజు ఆ గోపురం మీద పక్షులన్నీ వేరే చోటకి వలస వెళ్లిపోతున్నాయి. ఈ పావురాల జంట తమ గూటి నుండి బయటికి వచ్చి చూడగా గోపురంపై ఒక్క పక్షి కూడా కనిపించలేదు. దానికి కారణం ఆ గోపురంపై ఒక డేగ మాటేసుకుని తిరుగుతూ ఉండడం కనిపించింది. ఓహో ఇదా సంగతి అని ఆడపావురం మగపావురంతో మనం కూడా ఈ గోపురం వదిలి ఎక్కడికైనా సురక్షిత ప్రదేశానికి ఎగిరి వెళ్లపోదాం. ఆ డేగ వెళ్లినాక మళ్లీ మన గూటికి చేరుకుందాం అని ముందు చూపుతో చెప్పగా..అందుకు ఆ మగపావురం ఎందుకు అలా భయపడుతున్నావు. ఆ డేగ ఏమంత మన కన్నా గొప్పదనీ.. ఏం మనకున్నట్టే దానకీ వాడైన ముక్కు ఉంది. మనకున్నట్టే బలమైన గోళ్లున్న కాళ్లున్నాయి. అది పొడిస్తే మనకు రక్తం వచ్చినట్లే దానికీ రక్తం వస్తుంది. దానికి పోయే కాలం వచ్చే ఇటు వచ్చింది. రానీ..రానీ దాన్ని చంపి పారేస్తాను. నువ్వు అనవసరంగా భయం పెట్టుకోకు అని వారించింది. దాంతో ఆడపావురం ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. మర్నాడు ఉదయం మగపావురం గూటి నుండి బయటికి వచ్చింది. వచ్చీ రాగానే డేగ తన కాళ్లతో తన్నుకుని ఎగరేసుకెళ్లిపోయింది. ఒంటరిదైన ఆడపావురం ఏం చేయలేక బాధపడుతూ ఉండిపోయింది.
నీతి : అందుకే అనువుగాని చోట అధికులమనరాదు అనేది ఈ కథలోని నీతి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







