పావురం సాహసం

- July 03, 2015 , by Maagulf
పావురం సాహసం

పూర్వం గోదావరి ఒడ్డున ఒక పురాతన దేవాలయం ఉండేది. దాని గోపుర ద్వారంలో అనేక రకాల పక్షులు నివసిస్తూ ఉండేవి. అదే గోపురం వద్ద ఒక పావురాల జంట కూడా ఉండేది. ఆ జంట పావురాలలో ఆడపావురం కొంత ముందు జాగ్రత్త కలది. మగపావురం మాత్రం అస్సలు జాగ్రత్త లేకుండా ప్రమాదం పొంచి వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకుంటుంది. ఇలా ఉండగా ఒకరోజు ఆ గోపురం మీద పక్షులన్నీ వేరే చోటకి వలస వెళ్లిపోతున్నాయి. ఈ పావురాల జంట తమ గూటి నుండి బయటికి వచ్చి చూడగా గోపురంపై ఒక్క పక్షి కూడా కనిపించలేదు. దానికి కారణం ఆ గోపురంపై ఒక డేగ మాటేసుకుని తిరుగుతూ ఉండడం కనిపించింది. ఓహో ఇదా సంగతి అని ఆడపావురం మగపావురంతో మనం కూడా ఈ గోపురం వదిలి ఎక్కడికైనా సురక్షిత ప్రదేశానికి ఎగిరి వెళ్లపోదాం. ఆ డేగ వెళ్లినాక మళ్లీ మన గూటికి చేరుకుందాం అని ముందు చూపుతో చెప్పగా..అందుకు ఆ మగపావురం ఎందుకు అలా భయపడుతున్నావు. ఆ డేగ ఏమంత మన కన్నా గొప్పదనీ.. ఏం మనకున్నట్టే దానకీ వాడైన ముక్కు ఉంది. మనకున్నట్టే బలమైన గోళ్లున్న కాళ్లున్నాయి. అది పొడిస్తే మనకు రక్తం వచ్చినట్లే దానికీ రక్తం వస్తుంది. దానికి పోయే కాలం వచ్చే ఇటు వచ్చింది. రానీ..రానీ దాన్ని చంపి పారేస్తాను. నువ్వు అనవసరంగా భయం పెట్టుకోకు అని వారించింది. దాంతో ఆడపావురం ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. మర్నాడు ఉదయం మగపావురం గూటి నుండి బయటికి వచ్చింది. వచ్చీ రాగానే డేగ తన కాళ్లతో తన్నుకుని ఎగరేసుకెళ్లిపోయింది. ఒంటరిదైన ఆడపావురం ఏం చేయలేక బాధపడుతూ ఉండిపోయింది.
నీతి : అందుకే అనువుగాని చోట అధికులమనరాదు అనేది ఈ కథలోని నీతి.


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com