మానసిక ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి
- July 03, 2015
కేవలం శారీరక ఆరోగ్యమే కాదు. మానసిక ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవాలి. కానీ కొందరు కేవలం శరీరం ఆరోగ్యంగా ఉండే ఆహారం తీసుకోవడంలాంటివి మాత్రమే చేస్తుంటారు. కానీ శరీరంతో పాటు మనసు కూడా ఆరోగ్యంగా ఉంటేనే మొత్తం మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లు. మానసిక ఆరోగ్యం అంటే మెదడు ఆరోగ్యంగా ఉన్నట్లు. మన మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే, ముఖ్యంగా మనం తినే ఆహారంలో ఇవి తరచుగా ఉండేలా చూసుకోవాలి. చేపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. అయితే చేపల్లో ఉండే ఫాటీ ఆమ్లాలు మెదడుకు ఎంతో అవసరం అయిన ‘సెలీనియం’ను అందిస్తాయి. దాంతో మెదడు చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటుంది. ఎదిగే పిల్లల్లో చేపలు తరచూ తీసుకుంటే ఎంతో మంచిది. ఆలీవ్ ఆయిల్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు. సాధారణంగా వాడే ఆయిల్లో రోజూ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి వాడడం ఎంతో మంచిది. ఇది ఒత్తిడిని తగ్గించి, మెదడు పని తీరుని మెదుగుపరుస్తుంది. ఇక తృణదాన్యాలు. వీటిని వారంలో కనీసం నాలుగు సార్లైనా తీసుకుంటే మంచిది. తృణధాన్యాలతో చేసిన జావ ఉదాహరణకు రాగి జావలాంటి వాటిని ప్రతిరోజూ ఉందయం ఒక గ్లాసు తీసుకుంటే మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగి రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. వీటిలో కొవ్వుశాతం కూడా తక్కువ. శరీరానికి తగినంత శక్తిని కూడా అందించి ఆరోగ్యంగా ఉంచుతుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







