ఫుజైరా హోమ్లో అగ్నిప్రమాదం.. ఇద్దరు పిల్లలు మృతి
- June 26, 2024
యూఏఈ: ఫుజైరాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతుల్లో 8 ఏళ్ల బాలిక మరియు 7 ఏళ్ల బాలుడు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన ఐదేళ్ల చిన్నారిని అధికారులు రక్షించారు. సివిల్ డిఫెన్స్ ఆపరేటింగ్ రూమ్కు మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు అల్ తువియాయిన్లోని ఓ ఇంటిలో మంటలు చెలరేగినట్లు సమాచారం అందింది. సివిల్ డిఫెన్స్ బృందాలు వెంటనే ఇంటికి ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను అధికారులు ఇంకా నిర్ధారించలేదు. దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ఇదిలా ఉండగా, దేశంలో వేసవి కాలం ప్రారంభమవుతున్నందున అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలని ఫుజైరా సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ అలీ ఒబైద్ అల్ తునైజీ ప్రజలను కోరారు. ఎయిర్ కండిషనింగ్ మరియు శీతలీకరణ పరికరాల వల్ల విద్యుత్ లోడ్లు పెరిగే ప్రమాదం ఉన్నందున, ఎలక్ట్రికల్ లైన్ల నిర్వహణ, వాటి భద్రతను నిర్ధారించాలని ఆయన నివాసితులను కోరారు. ఫుజైరా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ మహ్మద్ అహ్మద్ బిన్ ఘానెమ్ అల్ కాబి ఇద్దరు పిల్లల మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయపడిన కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







