రెసిడెన్సీ ఉల్లంఘనదారులపై కువైట్ కొరడా
- July 06, 2024
కువైట్: రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయడానికి అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు తనిఖీలను కొనసాగిస్తున్నారు. జూన్ 30తో కార్మికులు కువైట్ ప్రకటించిన క్షమాభిక్ష పథకం గడువు ముగిసిన విషయం తెలిసిందే. ప్రత్యేక భద్రతా దళాలు అల్-ఖురైన్, హవల్లీ మరియు మహ్బౌలా మార్కెట్లలో తనిఖీలను నిర్వహించాయి. ఈ సందర్భంగా149 మందిని అదుపులోకి తీసుకున్నారు. హవల్లి, ఫర్వానియా, అల్-ముత్లా మరియు అల్-దజీజ్లలో కూడా భద్రతా తనిఖీలను నిర్వహించారు. అక్కడ కూడా 114 మందిని అరెస్టు చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారి ప్రయాణ టిక్కెట్కు చెల్లించే వారితో సహా, ఉల్లంఘించిన వారికి ఆశ్రయం కల్పించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. భద్రతా ఏజన్సీలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే అధికార యంత్రాంగానికి నివేదించాలని అధికారులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









