జోర్డాన్ శరణార్థులకు మద్దతుగా సౌదీ అరేబియా
- July 06, 2024
అమ్మాన్: సిరియన్, పాలస్తీనియన్ శరణార్థులు, జోర్డాన్లోని హోస్ట్ కమ్యూనిటీకి మద్దతుగా మానవతా ప్రాజెక్టుల శ్రేణిని ప్రారంభించినట్టు కింగ్ సల్మాన్ సెంటర్ ఫర్ రిలీఫ్ అండ్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ (KSrelief) జనరల్ సూపర్వైజర్ డాక్టర్ అబ్దుల్లా అల్ రబీహ్ వెల్లడించారు. అమ్మాన్లోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయంలో ఈ మేరకు ప్రకటించారు. సహకరించినందుకు జోర్డాన్కు కృతజ్ఞతలు తెలిపారు. సౌదీ అరేబియా రాజ్యం శరణార్థులకు వారి జీవితాలను పునర్నిర్మించడానికి, మెరుగైన భవిష్యత్తును పొందేందుకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. శరణార్థులకు ఆహార భద్రతకు మద్దతుగా $12,800,000 చొరవను అమలు చేయడానికి KSrelief మరియు UN వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (WFP) సహకార ఒప్పందంపై సంతకం చేశాయి. కింగ్ హుస్సేన్ క్యాన్సర్ సెంటర్ (KHCC) భాగస్వామ్యంతో గాజా స్ట్రిప్లోని క్యాన్సర్ రోగులకు చికిత్స చేసే ప్రాజెక్ట్ $3,615,800 ఖర్చుతో ప్రారంభించారు. జోర్డాన్ హాషెమైట్ ఛారిటీ ఆర్గనైజేషన్ (JHCO) భాగస్వామ్యంతో సిరియన్ మరియు జోర్డానియన్ అనాథల సంరక్షణ కోసం ఒక ప్రాజెక్ట్ $1,304,591 తో ప్రారంభించినట్టు వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







