రాజ్తరుణ్ ఎందుకిలా చేస్తున్నాడు.!
- July 06, 2024
‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై చాలా తక్కువ టైమ్లోనే సక్సెస్ల మీద సక్సెస్లు కొట్టి హీరోగా బాగా లాభపడిపోయిన కుర్రోడు రాజ్ తరుణ్. బ్యాక్ టు బ్యాక్ డబుల్ హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
అయితే ఆ తర్వాత ఢీలా పడ్డాడనుకోండి. తాజాగా రాజ్ తరుణ్ వార్తల్లో హాట్ టాపిక్ అయ్యాడు. అందుకు కారణం ఆయన నటిస్తున్న సినిమానో మరోటో కాదు, తనను రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ ఆయన గాళ్ ఫ్రెండ్ రచ్చకెక్కడమే రాజ్ తరుణ్ హాట్ టాపిక్ అవ్వడానికి కారణం.
లావణ్య నార్సింగి అనే అమ్మాయితో రాజ్ తరుణ్ గత కొంత కాలంగా సహజీవనంలో వున్నాడు. దాదాపు 11 ఏళ్లు సహజీవనం చేసిన ఆయన ఇప్పుడు ఆమెకు హ్యాండిచ్చాడట. రాజ్ తరుణ్ అంటే తనకెంతో ఇష్టమనీ, ఎలాగైనా ఆయనను తనకు దక్కేలా చేయాలని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే గతంలోనూ ఈ తరహా రచ్చ రాజ్ తరుణ్ విషయంలో జరిగింది. హీరోయిన్ హెబ్బా పటేల్తో రాజ్ తరుణ్కి ఎఫైర్ వుందన్న టాక్ కూడా నడిచింది ఆ టైమ్లో.
అప్పుడేదో అలా సద్దుమనిగిన ఆ ఇష్యూ మళ్లీ ఇప్పుడు కొత్తగా తెర పైకి వచ్చింది. తన తప్పేమీ లేదనీ, లావణ్య కావాలని తనను బద్నాం చేస్తోందనీ, గతంలో ఆమెతో రిలేషన్లో వున్నప్పటికీ ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదనీ, ఆమె చేస్తున్న ఆరోపణలపై లీగల్గా తాను కూడా ప్రొసీడ్ అవుతానని రాజ్ తరుణ్ చెబుతున్నాడు. చూడాలి మరి, ఎలా సద్దుమనుగుతుందో రాజ్ ఈ రచ్చ.!
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







