హైదరాబాద్లోని ప్రజాభవన్లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ
- July 06, 2024
హైదరాబాద్: హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మరో ఇద్దరు అధికారులు ఉన్నారు.
చంద్రబాబు నాయుడితో పాటు మంత్రులు కందుల దుర్గేశ్, సత్య ప్రసాద్, బీసీ జనార్దన్ ఉన్నారు. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్, అధికారులు కార్తికేయ మిశ్రా, రవిచంద్ర ఉన్నారు.
ఉమ్మడి విభజన సమస్యలపై పరిష్కారంపై చంద్రబాబు, రేవంత్ చర్చించనున్నారు. తొలిసారి ఇరువురు ముఖ్యమంత్రులు సమావేశం అవుతున్నారు. భేటీ అనంతరం ఇరువురు సీఎంలు మీడియా సమావేశం నిర్వహిస్తారు. అలాగే, ప్రజాభవన్ లోనే చంద్రబాబు టీమ్ డిన్నర్ చేస్తుంది.
- షెడ్యూల్డ్ 9, 10 లోని పెండింగ్ సమస్యల పరిష్కారం దిశగా చర్చలు
- పోలవరం ముంపుకు దూరంగా ఉన్న ఐదు గ్రామాలపై చర్చ
- కృష్ణా జలాలవివాదం చర్చ
- పోలవరం ముంపుకు దూరంగా ఉన్న ఐదు గ్రామాలపై చర్చ
- విద్యుత్తు సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశం
- విభజనకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టి
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







