115,000 దిర్హామ్లు చోరీ..మాజీ ఉద్యోగికి జైలుశిక్ష, జరిమానా
- July 07, 2024
దుబాయ్: ఒక సాధారణ ట్రేడింగ్ కంపెనీకి చెందిన మాజీ ఉద్యోగి.. సంస్థ నుండి రెండేళ్లకు పైగా గణనీయమైన మొత్తంలో డబ్బును అపహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అతడిని కోర్టు దోషిగా నిర్ధారించింది. బహిష్కరణతో పాటు ఒక నెల జైలు శిక్ష విధించారు. అతను మోసం చేసిన దానికి సమానమైన మొత్తం జరిమానా కింద విధించారు. అంతకుముందు, దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 2017 నుండి డిసెంబర్ 2019 వరకు అల్ మురఖబాత్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ నేరానికి 34 ఏళ్ల భారతీయ పౌరుడిపై అభియోగాలు నమోదు చేశారు. ఖాతాదారులకు వస్తువులను డెలివరీ చేయడం మరియు బకాయిలు వసూలు చేయడం వంటి బాధ్యత కలిగిన నిందితుడు మొత్తం 114,966 దిర్హామ్లను తన జేబులో వేసుకున్నాడని విచారణలో గుర్తించారు. డ్రైవర్గా తన విధులను నిర్వర్తిస్తున్నప్పుడు సదరు వ్యక్తి అకౌంటింగ్ రికార్డులను తారుమారు చేశాడని దుబాయ్ క్రిమినల్ కోర్టులోని న్యాయమూర్తులు తమ తీర్పులో వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







