115,000 దిర్హామ్లు చోరీ..మాజీ ఉద్యోగికి జైలుశిక్ష, జరిమానా
- July 07, 2024
దుబాయ్: ఒక సాధారణ ట్రేడింగ్ కంపెనీకి చెందిన మాజీ ఉద్యోగి.. సంస్థ నుండి రెండేళ్లకు పైగా గణనీయమైన మొత్తంలో డబ్బును అపహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అతడిని కోర్టు దోషిగా నిర్ధారించింది. బహిష్కరణతో పాటు ఒక నెల జైలు శిక్ష విధించారు. అతను మోసం చేసిన దానికి సమానమైన మొత్తం జరిమానా కింద విధించారు. అంతకుముందు, దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 2017 నుండి డిసెంబర్ 2019 వరకు అల్ మురఖబాత్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ నేరానికి 34 ఏళ్ల భారతీయ పౌరుడిపై అభియోగాలు నమోదు చేశారు. ఖాతాదారులకు వస్తువులను డెలివరీ చేయడం మరియు బకాయిలు వసూలు చేయడం వంటి బాధ్యత కలిగిన నిందితుడు మొత్తం 114,966 దిర్హామ్లను తన జేబులో వేసుకున్నాడని విచారణలో గుర్తించారు. డ్రైవర్గా తన విధులను నిర్వర్తిస్తున్నప్పుడు సదరు వ్యక్తి అకౌంటింగ్ రికార్డులను తారుమారు చేశాడని దుబాయ్ క్రిమినల్ కోర్టులోని న్యాయమూర్తులు తమ తీర్పులో వెల్లడించారు.
తాజా వార్తలు
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ









