115,000 దిర్హామ్లు చోరీ..మాజీ ఉద్యోగికి జైలుశిక్ష, జరిమానా
- July 07, 2024
దుబాయ్: ఒక సాధారణ ట్రేడింగ్ కంపెనీకి చెందిన మాజీ ఉద్యోగి.. సంస్థ నుండి రెండేళ్లకు పైగా గణనీయమైన మొత్తంలో డబ్బును అపహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అతడిని కోర్టు దోషిగా నిర్ధారించింది. బహిష్కరణతో పాటు ఒక నెల జైలు శిక్ష విధించారు. అతను మోసం చేసిన దానికి సమానమైన మొత్తం జరిమానా కింద విధించారు. అంతకుముందు, దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 2017 నుండి డిసెంబర్ 2019 వరకు అల్ మురఖబాత్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ నేరానికి 34 ఏళ్ల భారతీయ పౌరుడిపై అభియోగాలు నమోదు చేశారు. ఖాతాదారులకు వస్తువులను డెలివరీ చేయడం మరియు బకాయిలు వసూలు చేయడం వంటి బాధ్యత కలిగిన నిందితుడు మొత్తం 114,966 దిర్హామ్లను తన జేబులో వేసుకున్నాడని విచారణలో గుర్తించారు. డ్రైవర్గా తన విధులను నిర్వర్తిస్తున్నప్పుడు సదరు వ్యక్తి అకౌంటింగ్ రికార్డులను తారుమారు చేశాడని దుబాయ్ క్రిమినల్ కోర్టులోని న్యాయమూర్తులు తమ తీర్పులో వెల్లడించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









