హైదరాబాద్ కేవ్ పబ్లో డ్రగ్స్ కలకలం..
- July 08, 2024
హైదరాబాద్: నగరంలోని మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. ఇప్పటికే పలు పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న అనుమానంతో జూబ్లీహిల్స్ సహా పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
తాజాగా కేవ్ పబ్ పై దాడి చేసిన పోలీసులు డ్రగ్స్, గంజాయిని గుర్తించారు. జాయింట్ ఆపరేషన్ చేపట్టిన సైబరాబాద్ ఎస్ఓటీ(SOT), టీజీ న్యాబ్ అధికారులు.. మత్తుపదార్థాలు సేవించిన 24మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నట్లు వెల్లడించారు. మెుత్తం 55మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. 24మందికి పాజిటివ్ తేలిందని మాదాపూర్ డీసీపీ వినీత్ చెప్పారు.
కేవ్ పబ్లో పని చేసే అబ్దుల్ అయూబ్ అనే డీజే కూడా మత్తుపదార్థాలు సేవించినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. మేనేజర్ ఆర్.శేఖర్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. నిందితులపై ఎన్డీపీఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు. 24మంది కూడా పబ్ బయటే మత్తుపదార్థాలు తీసుకుని లోపలికి వచ్చారని, విచారణ అనంతరం పబ్ను మూసివేస్తామని ఆయన తెలిపారు. పబ్ యజమానులు నలుగురినీ త్వరలో అదుపులోకి తీసుకుంటామని, గతంలోనూ ఈ తరహా పార్టీలు ఇక్కడ జరిగాయనే అనుమానాలు ఉన్నాయని డీసీపీ పేర్కొన్నారు. పబ్ ఓనర్స్ను అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం వస్తుందని చెప్పారు. తరచుగా అన్నీ పబ్బుల్లో తనిఖీలు చేస్తున్నామని.. డ్రగ్స్ సరఫరా చేసినా, ఎవరైనా వాటిని సేవించినా కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అమెజాన్, టీసీఎస్ వంటి సంస్థలు తమ ఉద్యోగులు డ్రగ్స్ వినియోగించకుండా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని డీసీపీ వినీత్ సూచించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









