వాహనాలను క్లియర్ చేయాలని దుబాయ్ మునిసిపాలిటీ హెచ్చరిక
- July 11, 2024
యూఏఈ: ఎమిరేట్లోని తొమ్మిది రిజిస్ట్రేషన్ మరియు పరీక్షా కేంద్రాలలో వదిలేసిన వాహనాలను వాటి యజమానులు వెంటనే క్లియర్ చేయకపోతే వాటిని జప్తు చేస్తామని అధికారులు ప్రకటించారు. దుబాయ్ మునిసిపాలిటీ 68 వాహన క్లియరెన్స్ హెచ్చరికలను జారీ చేసింది. వార్సన్, ఖుసైస్, షామిల్ ముహైస్నా, వాసెల్ నద్ అల్ హమర్, తమామ్, అల్ అవీర్ మోటార్ షో, అల్ బర్షా, అల్ ముమయాజ్ మరియు వాసెల్ అల్ జదాఫ్ కేంద్రాలలో ఈ ప్రచారం నిర్వహించారు. నోటీసులో పేర్కొన్న వ్యవధిలోగా వాహనం క్లియర్ కాకపోతే, అది అల్ అవీర్ ప్రాంతంలోని ఇంపౌండ్మెంట్ యార్డ్కు తరలిస్తామని, వేలం వేయడానికి ముందు, యజమాని మున్సిపాలిటీ అధికారులను సంప్రదించడం ద్వారా దాన్ని తిరిగి పొందవచ్చని దుబాయ్ మునిసిపాలిటీలోని వేస్ట్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సయీద్ సఫర్ తెలిపారు.
తాజా వార్తలు
- తిరుమల: శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ
- సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించిన టాస్క్ ఫోర్స్
- జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు
- ఐసిసి ర్యాంకింగ్ లో 'కింగ్' విరాట్ కోహ్లినే!!
- సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి
- కేంద్ర మంత్రి పాటిల్ సమక్షంలో చంద్రబాబు, రేవంత్ భేటి
- శ్రీవాణి టికెట్ల కేంద్రంలో సౌకర్యాలు కల్పించండి: టీటీడీ ఈవో శ్యామలరావు
- సలాలా అగ్రిటూరిజం ప్రాజెక్టులో గణనీయమైన పురోగతి..!!
- అబుదాబిలో 12 ప్రైవేట్ స్కూల్స్ పై నిషేధం..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్.. మిర్దిఫ్లో ట్రాఫిక్ డైవెర్షన్స్ అమలు..!!