వాహనాలను క్లియర్ చేయాలని దుబాయ్ మునిసిపాలిటీ హెచ్చరిక
- July 11, 2024
యూఏఈ: ఎమిరేట్లోని తొమ్మిది రిజిస్ట్రేషన్ మరియు పరీక్షా కేంద్రాలలో వదిలేసిన వాహనాలను వాటి యజమానులు వెంటనే క్లియర్ చేయకపోతే వాటిని జప్తు చేస్తామని అధికారులు ప్రకటించారు. దుబాయ్ మునిసిపాలిటీ 68 వాహన క్లియరెన్స్ హెచ్చరికలను జారీ చేసింది. వార్సన్, ఖుసైస్, షామిల్ ముహైస్నా, వాసెల్ నద్ అల్ హమర్, తమామ్, అల్ అవీర్ మోటార్ షో, అల్ బర్షా, అల్ ముమయాజ్ మరియు వాసెల్ అల్ జదాఫ్ కేంద్రాలలో ఈ ప్రచారం నిర్వహించారు. నోటీసులో పేర్కొన్న వ్యవధిలోగా వాహనం క్లియర్ కాకపోతే, అది అల్ అవీర్ ప్రాంతంలోని ఇంపౌండ్మెంట్ యార్డ్కు తరలిస్తామని, వేలం వేయడానికి ముందు, యజమాని మున్సిపాలిటీ అధికారులను సంప్రదించడం ద్వారా దాన్ని తిరిగి పొందవచ్చని దుబాయ్ మునిసిపాలిటీలోని వేస్ట్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సయీద్ సఫర్ తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







