వాహనాలను క్లియర్ చేయాలని దుబాయ్ మునిసిపాలిటీ హెచ్చరిక
- July 11, 2024
యూఏఈ: ఎమిరేట్లోని తొమ్మిది రిజిస్ట్రేషన్ మరియు పరీక్షా కేంద్రాలలో వదిలేసిన వాహనాలను వాటి యజమానులు వెంటనే క్లియర్ చేయకపోతే వాటిని జప్తు చేస్తామని అధికారులు ప్రకటించారు. దుబాయ్ మునిసిపాలిటీ 68 వాహన క్లియరెన్స్ హెచ్చరికలను జారీ చేసింది. వార్సన్, ఖుసైస్, షామిల్ ముహైస్నా, వాసెల్ నద్ అల్ హమర్, తమామ్, అల్ అవీర్ మోటార్ షో, అల్ బర్షా, అల్ ముమయాజ్ మరియు వాసెల్ అల్ జదాఫ్ కేంద్రాలలో ఈ ప్రచారం నిర్వహించారు. నోటీసులో పేర్కొన్న వ్యవధిలోగా వాహనం క్లియర్ కాకపోతే, అది అల్ అవీర్ ప్రాంతంలోని ఇంపౌండ్మెంట్ యార్డ్కు తరలిస్తామని, వేలం వేయడానికి ముందు, యజమాని మున్సిపాలిటీ అధికారులను సంప్రదించడం ద్వారా దాన్ని తిరిగి పొందవచ్చని దుబాయ్ మునిసిపాలిటీలోని వేస్ట్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సయీద్ సఫర్ తెలిపారు.
తాజా వార్తలు
- దోపిడీ, మనీలాండరింగ్ కేసులో 80 మంది ముఠాకు జైలు శిక్ష..!!
- వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్న2400 జంటలు..!!
- రమదాన్..ఎనిమిదవ మక్కా లాంతర్ల ఉత్సవం ప్రారంభం..!!
- యూఏఈ ఎతిహాద్-శాట్ ప్రయోగం విజయవంతం..!!
- మాదకద్రవ్యాల వినియోగం..మహిళకు 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- అమెరికాలో గ్రీన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్..
- హెచ్ఐవీకి చెక్ పెట్టేలా కొత్త మందు..
- షఖురాలో హత్య.. సోషల్ మీడియాలో పుకార్లను ఖండించిన బాధిత ఫ్యామిలీ..!!
- 2025-26 అకాడమిక్ ఇయర్.. విద్యార్థుల నమోదుకు సర్క్యులర్ జారీ..!!