తీవ్రవాద గ్రూపు సభ్యులకు జీవిత ఖైదు, Dh20 మిలియన్ల జరిమానా

- July 11, 2024 , by Maagulf
తీవ్రవాద గ్రూపు సభ్యులకు జీవిత ఖైదు, Dh20 మిలియన్ల జరిమానా

యూఏఈ: జస్టిస్ అండ్ డిగ్నిటీ ఆర్గనైజేషన్ కేసులో అబుదాబి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ స్టేట్ సెక్యూరిటీ డివిజన్ ఉగ్రవాద ముస్లిం బ్రదర్‌హుడ్ సంస్థకు చెందిన 53 మంది సభ్యులతో పాటు ఆరు కంపెనీలను దోషులుగా నిర్ధారించింది. వారికి యావజ్జీవ కారాగార శిక్ష నుండి 20 మిలియన్ దిర్హాంల వరకు జరిమానాను కోర్టు  విధించింది. 

ఉగ్రవాద చర్యలకు పాల్పడే ఉద్దేశ్యంతో జస్టిస్ అండ్ డిగ్నిటీ ఆర్గనైజేషన్‌ను స్థాపించడం మరియు నిర్వహించడం పై కేసు నమోదు చేసి నలభై-మూడు మంది నిందితులకు జీవిత ఖైదు విధించారు. సోషల్ మీడియాలో  వ్యతిరేక కథనాలు ప్రసారం చేసి సహకరించినందుకు ఐదుగురు నిందితులకు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. నిధులు సమకూర్చడం ద్వారా మనీలాండరింగ్ నేరాలకు పాల్పడినందుకు మరో ఐదుగురు నిందితులకు 10 సంవత్సరాల జైలు శిక్ష , ఒక్కొక్కరికి 10 మిలియన్ల జరిమానా విధించారు. ఆరు కంపెనీలు మరియు వాటి అధికారులకు ఒక్కొక్కరికి Dh20 మిలియన్ల జరిమానా విధించారు.  

రిఫార్మ్ కాల్ ఆర్గనైజేషన్‌కు సహకరించినందుకు మరియు ఆర్థిక సహాయాన్ని అందించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 24 మంది నిందితులపై ఉన్న క్రిమినల్ కేసులను కోర్టు కొట్టివేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com