తీవ్రవాద గ్రూపు సభ్యులకు జీవిత ఖైదు, Dh20 మిలియన్ల జరిమానా
- July 11, 2024
యూఏఈ: జస్టిస్ అండ్ డిగ్నిటీ ఆర్గనైజేషన్ కేసులో అబుదాబి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ స్టేట్ సెక్యూరిటీ డివిజన్ ఉగ్రవాద ముస్లిం బ్రదర్హుడ్ సంస్థకు చెందిన 53 మంది సభ్యులతో పాటు ఆరు కంపెనీలను దోషులుగా నిర్ధారించింది. వారికి యావజ్జీవ కారాగార శిక్ష నుండి 20 మిలియన్ దిర్హాంల వరకు జరిమానాను కోర్టు విధించింది.
ఉగ్రవాద చర్యలకు పాల్పడే ఉద్దేశ్యంతో జస్టిస్ అండ్ డిగ్నిటీ ఆర్గనైజేషన్ను స్థాపించడం మరియు నిర్వహించడం పై కేసు నమోదు చేసి నలభై-మూడు మంది నిందితులకు జీవిత ఖైదు విధించారు. సోషల్ మీడియాలో వ్యతిరేక కథనాలు ప్రసారం చేసి సహకరించినందుకు ఐదుగురు నిందితులకు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. నిధులు సమకూర్చడం ద్వారా మనీలాండరింగ్ నేరాలకు పాల్పడినందుకు మరో ఐదుగురు నిందితులకు 10 సంవత్సరాల జైలు శిక్ష , ఒక్కొక్కరికి 10 మిలియన్ల జరిమానా విధించారు. ఆరు కంపెనీలు మరియు వాటి అధికారులకు ఒక్కొక్కరికి Dh20 మిలియన్ల జరిమానా విధించారు.
రిఫార్మ్ కాల్ ఆర్గనైజేషన్కు సహకరించినందుకు మరియు ఆర్థిక సహాయాన్ని అందించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 24 మంది నిందితులపై ఉన్న క్రిమినల్ కేసులను కోర్టు కొట్టివేసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







