ఏపీలో భారీ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!
- July 11, 2024
అమరావతి: ఏపీలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ఐదు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో రూ.60వేల కోట్ల పెట్టుబడితో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్కు కేంద్రం అంగీకరించింది.
కేంద్రంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ప్రభుత్వంలో కీలక మిత్రుడుగా చంద్రబాబు రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( బీపీసీఎల్ ) ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
రిఫైనరీ ఏర్పాటు అయ్యే మూడు ప్రాంతాలివేనా? :
అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పెట్రోలియం రిఫైనరీ కోసం ఏపీలో మూడు ప్రధాన ప్రదేశాలపై చర్చించారు. వీటిలో శ్రీకాకుళం, మచిలీపట్నం, రామాయపట్నం ఉన్నాయి. జూలై 23న సమర్పించే బడ్జెట్లో రిఫైనరీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. స్థలాలను అంచనా వేసి, ఆపై ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది.
ఈ ప్రక్రియకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని, బడ్జెట్లో రిఫైనరీ ఏర్పాటుకు సంబంధించిన స్థలాన్ని ప్రకటించకపోవచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి. రిఫైనరీ ఏర్పాటు చేయబోయే మూడు లొకేషన్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఉన్నందున ఈ ప్రకటన రాజకీయంగా సున్నితమైనదిగా చెప్పవచ్చు.
చంద్రబాబుకు చెందిన 16 మంది ఎంపీలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వానికి అవసరమైన మద్దతును అందిస్తారు. రిఫైనరీ అనేది రాష్ట్ర విభజన సమయంలో చేసిన నిబద్ధత, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో నిర్దేశించింది. చట్టంలోని సెక్షన్ 93 ప్రకారం.. పదమూడవ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా అవసరమైన అన్ని చర్యలను కేంద్రం తీసుకుంటుంది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







