అనంత్- రాధిక ‘శుభ్ ఆశీర్వాద్’ వేడుక..హాజరైన ప్రధాని మోదీ..
- July 14, 2024
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ నవ వధూవరులు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ‘ శుభ్ ఆశీర్వాద్’ (ఆశీర్వాద వేడుక)కు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను మోదీ ఆశీర్వదించారు. ముకేశ్ అంబానీ, నీతా అంబానీలు ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
అంబానీ వివాహ వేడుకలో భాగంగా నిర్వహించిన ‘శుభ్ ఆశీర్వాద్’కి బాలీవుడ్ తారలు, రాజకీయ నాయకులు, అంతర్జాతీయ ప్రముఖులు, ఇతర ప్రజా ప్రముఖులు హాజరయ్యారు. ఆదివారం రోజున ‘మంగళ ఉత్సవ్’ లేదా వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ముందు.. ప్రధాని నరేంద్ర మోదీ ముంబైలో రూ. 29వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం శంకుస్థాపన చేశారు. వీటిలో రోడ్డు, రైల్వే, పోర్టు ప్రాజెక్టులు ఉన్నాయి.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







