అనంత్- రాధిక ‘శుభ్ ఆశీర్వాద్’ వేడుక..హాజరైన ప్రధాని మోదీ..
- July 14, 2024
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ నవ వధూవరులు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ‘ శుభ్ ఆశీర్వాద్’ (ఆశీర్వాద వేడుక)కు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను మోదీ ఆశీర్వదించారు. ముకేశ్ అంబానీ, నీతా అంబానీలు ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
అంబానీ వివాహ వేడుకలో భాగంగా నిర్వహించిన ‘శుభ్ ఆశీర్వాద్’కి బాలీవుడ్ తారలు, రాజకీయ నాయకులు, అంతర్జాతీయ ప్రముఖులు, ఇతర ప్రజా ప్రముఖులు హాజరయ్యారు. ఆదివారం రోజున ‘మంగళ ఉత్సవ్’ లేదా వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ముందు.. ప్రధాని నరేంద్ర మోదీ ముంబైలో రూ. 29వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం శంకుస్థాపన చేశారు. వీటిలో రోడ్డు, రైల్వే, పోర్టు ప్రాజెక్టులు ఉన్నాయి.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









