భారత్-శ్రీలంక షెడ్యూల్లో మార్పులు..
- July 14, 2024
టీమ్ఇండియా ఈ నెలాఖరులో శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేసింది. అయితే.. ఈ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూలై 26 నుంచి టీ20సిరీస్ ఆరంభం కావాల్సి ఉంది. అయితే.. ఒక్కరోజు ఆలస్యంగా అంటే జూలై 27 కి మార్చారు. అలాగే వన్డే సిరీస్ ఆగస్టు 1 నుంచి ఆరంభం కావాల్సి ఉండగా ఒక్క రోజు ఆలస్యంగా ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానుంది.
భారత్ వర్సెస్ శ్రీలంక సిరీస్ కొత్త షెడ్యూల్..
టీ20 సిరీస్..
తొలి టీ20–జూలై 27న
రెండ టీ20–జూలై 28న
మూడో టీ20–జూలై 30న
వన్డే సిరీస్..
తొలి వన్డే–ఆగస్టు 2న
రెండో వన్డే–ఆగస్టు 4న
మూడో వన్డే–ఆగస్టు 7న
టీ20 సిరీస్లోని మ్యాచులు అన్ని భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి.వన్డే సిరీస్లోని మ్యాచులు అన్ని మధ్యాహ్నం 2.30 గంటల నుంచి జరుగుతాయి. కాగా.. ఈ పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ఇంకా ఎంపిక చేయలేదు. త్వరలోనే జట్టును ప్రకటించనుంది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







