భారత్-శ్రీలంక షెడ్యూల్లో మార్పులు..
- July 14, 2024
టీమ్ఇండియా ఈ నెలాఖరులో శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేసింది. అయితే.. ఈ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూలై 26 నుంచి టీ20సిరీస్ ఆరంభం కావాల్సి ఉంది. అయితే.. ఒక్కరోజు ఆలస్యంగా అంటే జూలై 27 కి మార్చారు. అలాగే వన్డే సిరీస్ ఆగస్టు 1 నుంచి ఆరంభం కావాల్సి ఉండగా ఒక్క రోజు ఆలస్యంగా ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానుంది.
భారత్ వర్సెస్ శ్రీలంక సిరీస్ కొత్త షెడ్యూల్..
టీ20 సిరీస్..
తొలి టీ20–జూలై 27న
రెండ టీ20–జూలై 28న
మూడో టీ20–జూలై 30న
వన్డే సిరీస్..
తొలి వన్డే–ఆగస్టు 2న
రెండో వన్డే–ఆగస్టు 4న
మూడో వన్డే–ఆగస్టు 7న
టీ20 సిరీస్లోని మ్యాచులు అన్ని భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి.వన్డే సిరీస్లోని మ్యాచులు అన్ని మధ్యాహ్నం 2.30 గంటల నుంచి జరుగుతాయి. కాగా.. ఈ పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ఇంకా ఎంపిక చేయలేదు. త్వరలోనే జట్టును ప్రకటించనుంది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









