జులై 1 నుంచి ఇండియాలో ఇండియన్లకీ వీసా.!

- June 14, 2016 , by Maagulf
జులై 1 నుంచి ఇండియాలో ఇండియన్లకీ వీసా.!

జూన్‌ నెలాఖరులోగా తమ వద్దనున్న పిఐఓ (పర్సన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజన్‌ కార్డ్‌)ని ఓసిఐ కార్డ్‌ (ఓవర్సీస్‌ సిటిజన్‌షిప్‌ ఆఫ్‌ ఇండియా కార్డ్‌)తో రీప్లేస్‌ చేసుకోని పక్షంలో, జులై 1 నుంచి ఇండియాకి వెళ్ళాలనుకునేవారికి వీసా తప్పనిసరవుతుంది. ఆఖరి నిమిషంలో సమస్యలు కొనితెచ్చుకోకుండా వీలైనంత త్వరగా ఈ ప్రాసెస్‌ని పూర్తి చేసుకోవాల్సిందిగా యూఏఈలోని ఇండియన్‌ అంబాసిడర్‌ విజ్ఞప్తి చేశారు. ఇండియన్‌ అంబాసిడర్‌ టు యూఏఈ టి.పి. సీతారామ్‌ మాట్లాడుతూ, కార్డుల జారీకి సమయం పడుతుందనీ, అవి న్యూ ఢిల్లీ నుంచి జారీ చేయబడ్తాయనీ, కార్డు కోసం అప్లయ్‌ చేయనివారు ఇండియాకి వెళ్ళాలంటే వీసా తీసుకోవాల్సి వస్తుందని వివరించారు. పిఐఓ కార్డు పదేళ్ళ కాలానికి పనిచేస్తుందని, ఓసిఐ కార్డు లైఫ్‌ టైమ్‌ వాలిడిటీ కలిగి ఉంటుందని ఆయన చెప్పారు. దుబాయ్‌లోని ఇండియన్‌ కాన్సులేట్‌ పిఐఓ కార్డ్‌ని ఓసిఐ కార్డ్‌గా కన్‌వర్ట్‌ అవడానికి ఎలాంటి రుసుమూ వసూలు చేయడంలేదు. సర్వీస్‌ ఛార్జ్‌ 6 దిర్హామ్‌లను కూడా లెవీ చేయబడ్తుంది. సిజిఐ దుబాయ్‌, అప్లికేషన్లను స్వీకరిస్తుందనీ ఉదయం గంటల నుంచి 12 గంటల వరకు అన్ని పనిదినాల్లోనూ ఈ అవకాశం ఉంటుందని ఇండియన్‌ కాన్సులేట్‌ స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com