ఒమన్ లో కాల్పులు.. మృతుల్లో భారతీయుడు..!

- July 17, 2024 , by Maagulf
ఒమన్ లో కాల్పులు.. మృతుల్లో భారతీయుడు..!

మస్కట్ః ఒమన్‌లోని మసీదు సమీపంలో జరిగిన కాల్పుల్లో కనీసం ఆరుగురు చనిపోయారు. అయితే మరణించిన వారిలో భారత్‌కు చెందిన వ్యక్తి ఒకరు ఉన్నారని ఒమాన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ దాడిలో నలుగురు పాకిస్థానీయులతో పాటు ఇద్దరు చనిపోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మరో 30 మంది గాయాలపాలైనట్లు పేర్కొన్నారు.ఈ ఘటన జరిగిన అనంతరం ఒక భారతీయుడు మృతి చెందగా..మరో భారతీయుడు గాయపడ్డారని ఒమాన్‌ విదేశాంగ శాఖ ఇండియన్ ఎంబసీకి తెలియజేసింది.

రాజధాని నగరం మస్కట్ గవర్నరేట్‌లోని వాడి అల్ కబీర్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు పాకిస్తానీ పౌరులు, ఒక పోలీస్ అధికారి కూడా మరణించారని వెల్లడించారు.కాగా, దీనిపై పాకిస్థాన్ అధికారులు స్పందించారు.దాడిలో మరణించిన పాకిస్థానీయుల మృతదేహాలను గుర్తించడం, స్వదేశానికి తీసుకురావడం కోసం ఒమన్‌లోని మా రాయబార కార్యాలయం ఒమన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందన్నారు.ఇదిలా ఉండగా, గాయపడిన పాకిస్థానీల యోగక్షేమాలు అడిగి తెలుసుకునేందుకు రాయబారి ఇమ్రాన్ అలీ స్థానిక ఆసుపత్రులను సందర్శించారు. ఒమన్‌లో అబ్దుల్ సమద్: 92040038, ఖాదీం హుస్సేన్: 98577355, అమీర్ సఫ్దర్: +923225251612, సయ్యద్ నిసరుల్ హక్: 94981966, అతిక్ అహ్మద్: 0045 9976,
ముదస్సిర్: 91391584, రాయబారి  సైఫుల్లా: 92109432 లను సంప్రదించాలని పాక్ ఎంబసీ కోరింది.  

మరోవైపు గల్ఫ్ దేశంలోని తమ పౌరులకు మస్కట్‌లోని అమెరికా రాయబార కార్యాలయం భద్రతా హెచ్చరికలు జారీ చేసింది."వాడీ కబీర్‌లో కాల్పుల ఘటనకు సంబంధించిన నివేదికలను యూఎస్ ఎంబసీ అనుసరిస్తోంది.అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలి, స్థానిక వార్తలను పర్యవేక్షించాలి మరియు స్థానిక అధికారుల ఆదేశాలను గమనించాలి." అని పేర్కొంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com