అల్లు అర్జున్ ‘పుష్ప’ తర్వాత మళ్లీ ఆయనతోనే.!
- July 18, 2024
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నీ కుదిరితే, ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రావల్సి వుంది. కానీ, పోస్ట్పోన్ అవ్వడంతో డిశంబర్లో రిలీజ్కి సిద్ధమవుతోంది.
ప్రస్తుతం 30 రోజుల షూటింగ్ పెండింగ్ వున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ కానున్నాయ్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రష్మికా మండన్నా హీరోయిన్ కాగా, మలయాళ నటుడు ఫహాద్ పాజిల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఆ సంగతి అటుంచితే, మరో నెల రోజుల్లో అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేయనున్నారు. ఆ తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్పై ఫోకస్ చేయాలనుకున్నారనీ సమాచారం.
అయితే, అల్లు అర్జున్ లిస్టులో ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా వంటి సక్సెస్ఫుల్ దర్శకులున్నారు. అలాగే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా చేయనున్నాడనీ తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం వేరే ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. సో, త్రివిక్రమ్ శ్రీనివాస్, బన్నీ కాంబినేషన్లో ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. అయితే, ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. అన్నట్లు ఈ కాంబో సూపర్ హిట్ కాంబో అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







