అల్లు అర్జున్ ‘పుష్ప’ తర్వాత మళ్లీ ఆయనతోనే.!
- July 18, 2024
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నీ కుదిరితే, ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రావల్సి వుంది. కానీ, పోస్ట్పోన్ అవ్వడంతో డిశంబర్లో రిలీజ్కి సిద్ధమవుతోంది.
ప్రస్తుతం 30 రోజుల షూటింగ్ పెండింగ్ వున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ కానున్నాయ్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రష్మికా మండన్నా హీరోయిన్ కాగా, మలయాళ నటుడు ఫహాద్ పాజిల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఆ సంగతి అటుంచితే, మరో నెల రోజుల్లో అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేయనున్నారు. ఆ తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్పై ఫోకస్ చేయాలనుకున్నారనీ సమాచారం.
అయితే, అల్లు అర్జున్ లిస్టులో ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా వంటి సక్సెస్ఫుల్ దర్శకులున్నారు. అలాగే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా చేయనున్నాడనీ తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం వేరే ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. సో, త్రివిక్రమ్ శ్రీనివాస్, బన్నీ కాంబినేషన్లో ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. అయితే, ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. అన్నట్లు ఈ కాంబో సూపర్ హిట్ కాంబో అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









