టెక్ సంక్షోభం…చేతిలో నగదు ఉంచుకోండి..!
- July 20, 2024
యూఏఈ: శుక్రవారం ప్రపంచాన్ని చుట్టుముట్టిన భారీ టెక్ క్రాష్ అనంతరం ఎల్లప్పుడూ కొంత నగదు చేతిలో పెట్టుకోవాలని నివాసితులు నేర్చుకున్నారు. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ అకస్మాత్తుగా షట్ డౌన్ కావడంతో నగదు కోసం తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. పోస్ మెషీన్స్ పనిచేయక పోవడంతో పేమెంట్ కష్టాలు ఎదుర్కొన్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అయిన మహమ్మద్ అబూహమీద్, అతను మరియు అతని స్నేహితులు బయట భోజనం చేసి, బిల్లు చెల్లించకుండా వెళ్లిపోవాల్సి వచ్చినప్పుడు "ఇబ్బంది"గా భావించినట్టు తెలిపారు. “నేను మరియు నా సహోద్యోగులు మా శుక్రవారం ప్రార్థనల తర్వాత అల్ నహ్దాలోని ఒక నిర్దిష్ట రెస్టారెంట్కి భోజనం కోసం వెళ్తాము. మేము సాధారణంగా ఏదైనా చెల్లింపుల కోసం మా డెబిట్ మరియు క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తాము. కానీ టెక్ క్రాష్ సమయంలో కార్డులు పనిచేయలేదు. దాంతో తరవాత బిల్ కట్టేందుకు హోటల్ మేనేజ్మెంట్ అంగీకరించింది. ”అని అబూ హమీద్ అన్నారు.
తాజా వార్తలు
- చిరంజీవికి ‘జీవిత సాఫల్య పురస్కారం’..
- ఫార్ములా 1 రేస్.. జెడ్డా, మక్కా, తైఫ్లో స్కూళ్లకు సెలవులు..!!
- యూఏఈలో 18 క్యారెట్ల గోల్డ్ జ్యువెలరీకి ఫుల్ డిమాండ్..!!
- బహ్రెయిన్ మంత్రితో సమావేశమైన భారత రాయబారి..!!
- రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం.. దౌత్య ప్రయత్నాలను స్వాగతించిన ఖతార్..!!
- 919 దిగుమతి చేసుకున్న మద్యం సీసాలు.. నలుగురు అరెస్టు..!!
- అల్ దఖిలియాకు పోటెత్తిన టూరిస్టుల..పర్యాటక ప్రదేశాల్లో రద్దీ..!!
- హైదరాబాద్ విమానాశ్రయం నుండి వియెట్నాం, హో చి మిన్కు విమాన సేవలు ప్రారంభం
- తెలంగాణలో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ సెంటర్.. !
- ఏపీ: విశాఖ, విజయవాడ మెట్రోకు కేంద్రం నిధులు విడుదల !