సింగపూర్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
- July 20, 2024
సింగపూర్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్..తన భార్య అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొనడానికి సింగపూర్ వెళ్లారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి పవన్ భార్య అన్నా లెజినోవా ఇవాళ ‘మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్’ పట్టా పొందారు. ఆ వర్సిటీ స్నాతకోత్సవానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. యూనివర్సిటీలో పీజీ పట్టా అందుకున్నాక పవన్ తో కలిసి అన్నా లెజినోవా ఫొటోలు దిగినట్లు తెలుస్తోంది. కొన్ని నెలలుగా రాజకీయాల్లో బిజీగా ఉంటున్న పవన్ కల్యాణ్ ఇవాళ సింపుల్గా ఫార్మల్ లుక్ లో కనపడడం అభిమానులను అలరిస్తోంది.
ఇటీవల పవన్, అన్నా లెజినోవా ఎయిర్పోర్టులో కనపడ్డారు. అన్నాను పవన్ కల్యాణ్ 2013లో పెళ్లి చేసుకున్నారు. పవన్ కల్యాణ్ కొన్ని వారాల క్రితమే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన సినిమాల్లో తక్కువగా నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన నటించిన ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలు విడుదల కావాల్సి ఉంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్..
- 17 మంది ప్రాణాలు తీసిన ఏసీ కంప్రెషర్!
- మిస్ వరల్డ్ కంటెస్టంట్లను అలరించిన సెక్రటేరియట్ డ్రోన్ షో
- కారు డోర్ లాక్–నలుగురు చిన్నారులు మృతి
- తన ఆత్మకథ పుస్తకావిష్కరణకు రావలసిందిగా రేవంత్,చంద్రబాబు కు బండారు దత్తాత్రేయ ఆహ్వానం
- త్వరలో తిరుపతిలో ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్
- ఐపీఎల్ అభిమానులకు జైన్ కువైట్ బంపరాఫర్.. KD1కే స్ట్రీమింగ్ ఆఫర్..!!
- గ్యాస్ సిలిండర్ పేలి కుప్పకూలిన భవనం.. భారతీయ దంపతులు మృతి..!!
- మస్కట్లో భారతీయుడు సహా నలుగురు శ్రీలంక ప్రవాసులు అరెస్ట్.. !!
- ట్రంప్ మిడ్ ఈస్ట్ పర్యటన: $2 ట్రిలియన్లకు పైగా బిజినెస్ ఒప్పందాలు..!!