సింగపూర్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
- July 20, 2024
సింగపూర్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్..తన భార్య అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొనడానికి సింగపూర్ వెళ్లారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి పవన్ భార్య అన్నా లెజినోవా ఇవాళ ‘మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్’ పట్టా పొందారు. ఆ వర్సిటీ స్నాతకోత్సవానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. యూనివర్సిటీలో పీజీ పట్టా అందుకున్నాక పవన్ తో కలిసి అన్నా లెజినోవా ఫొటోలు దిగినట్లు తెలుస్తోంది. కొన్ని నెలలుగా రాజకీయాల్లో బిజీగా ఉంటున్న పవన్ కల్యాణ్ ఇవాళ సింపుల్గా ఫార్మల్ లుక్ లో కనపడడం అభిమానులను అలరిస్తోంది.
ఇటీవల పవన్, అన్నా లెజినోవా ఎయిర్పోర్టులో కనపడ్డారు. అన్నాను పవన్ కల్యాణ్ 2013లో పెళ్లి చేసుకున్నారు. పవన్ కల్యాణ్ కొన్ని వారాల క్రితమే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన సినిమాల్లో తక్కువగా నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన నటించిన ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలు విడుదల కావాల్సి ఉంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







