సింగపూర్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
- July 20, 2024
సింగపూర్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్..తన భార్య అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొనడానికి సింగపూర్ వెళ్లారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి పవన్ భార్య అన్నా లెజినోవా ఇవాళ ‘మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్’ పట్టా పొందారు. ఆ వర్సిటీ స్నాతకోత్సవానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. యూనివర్సిటీలో పీజీ పట్టా అందుకున్నాక పవన్ తో కలిసి అన్నా లెజినోవా ఫొటోలు దిగినట్లు తెలుస్తోంది. కొన్ని నెలలుగా రాజకీయాల్లో బిజీగా ఉంటున్న పవన్ కల్యాణ్ ఇవాళ సింపుల్గా ఫార్మల్ లుక్ లో కనపడడం అభిమానులను అలరిస్తోంది.
ఇటీవల పవన్, అన్నా లెజినోవా ఎయిర్పోర్టులో కనపడ్డారు. అన్నాను పవన్ కల్యాణ్ 2013లో పెళ్లి చేసుకున్నారు. పవన్ కల్యాణ్ కొన్ని వారాల క్రితమే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన సినిమాల్లో తక్కువగా నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన నటించిన ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలు విడుదల కావాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









