శ్రీవారి భక్తులకు శుభవార్త..
- July 24, 2024
తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. వైకుంఠ వాసుడిని దర్శించుకున్న అనంతరం తమ మొక్కులు చెల్లించుకుంటారు. కోనేటి రాయుడికి కొంత మంది తలనీలాలు సమర్పిస్తే మరికొందరు నగలు, నగదు, బంగారంలతో పాటు విలువైన వస్తులను హుండీల్లో కానుకలుగా సమర్పిస్తుంటారు. ఇలాంటి కానుకల్లో కెమెరాలు సైతం ఉన్నాయి. తాజాగా ఇలా వచ్చిన కెమెరాలను ఈ-వేలం వేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తెలిపింది.
తిరుమలలోని శ్రీవారి ఆలయంలోని హుండీతో పాటు ఇతర తిరుమల అనుబంధ ఆలయాల్లో భక్తులు సమర్పించిన కానుకలను ఆగస్టు 1న ఈ-వేలం వేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకుల్లో కెమెరాలను రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నట్లు టీటీడీ పేర్కొంది.
Nikon, Canon, Kodak వంటి కంపెనీలతో పాటు ఇతర కంపెనీలకు చెందిన కెమెరాలు ఉన్నట్లు తెలిపింది. ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న మొత్తం 10 లాట్ కెమెరాలను ఈ-వేలం కోసం ఉంచుతున్నారు అధికారులు తెలిపారు. ఈ-వేలానికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు టీటీడీ మార్కెటింగ్ ఆఫీసు 0877-2264429 నంబర్ లేదా టీటీడీ వెబ్సైట్ http://tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ http://konugolu.ap.gov.inను సంప్రదించాలని సూచించింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









