శ్రీవారి భక్తులకు శుభవార్త..
- July 24, 2024
తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. వైకుంఠ వాసుడిని దర్శించుకున్న అనంతరం తమ మొక్కులు చెల్లించుకుంటారు. కోనేటి రాయుడికి కొంత మంది తలనీలాలు సమర్పిస్తే మరికొందరు నగలు, నగదు, బంగారంలతో పాటు విలువైన వస్తులను హుండీల్లో కానుకలుగా సమర్పిస్తుంటారు. ఇలాంటి కానుకల్లో కెమెరాలు సైతం ఉన్నాయి. తాజాగా ఇలా వచ్చిన కెమెరాలను ఈ-వేలం వేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తెలిపింది.
తిరుమలలోని శ్రీవారి ఆలయంలోని హుండీతో పాటు ఇతర తిరుమల అనుబంధ ఆలయాల్లో భక్తులు సమర్పించిన కానుకలను ఆగస్టు 1న ఈ-వేలం వేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకుల్లో కెమెరాలను రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నట్లు టీటీడీ పేర్కొంది.
Nikon, Canon, Kodak వంటి కంపెనీలతో పాటు ఇతర కంపెనీలకు చెందిన కెమెరాలు ఉన్నట్లు తెలిపింది. ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న మొత్తం 10 లాట్ కెమెరాలను ఈ-వేలం కోసం ఉంచుతున్నారు అధికారులు తెలిపారు. ఈ-వేలానికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు టీటీడీ మార్కెటింగ్ ఆఫీసు 0877-2264429 నంబర్ లేదా టీటీడీ వెబ్సైట్ http://tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ http://konugolu.ap.gov.inను సంప్రదించాలని సూచించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







