ఒమన్లో పెరగనున్న బంగారం కొనుగోళ్లు..
- July 25, 2024
మస్కట్: బంగారం మరియు వెండిపై కస్టమ్స్ సుంకాలను 15 శాతం నుండి 6 శాతానికి తగ్గించాలని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారతీయ ప్రవాసులు బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని ఒమన్ సుల్తానేట్లోని బంగారు వర్తకులు, ఆభరణాల వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాల నుంచి కొనుగోలు చేసిన బంగారం అధిక నాణ్యతతో ఉంటుందని నమ్మకం ఉండటంతో ప్రవాసులను మరింత బంగారం కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తుందని స్థానిక వ్యాపారులు భావిస్తున్నారు. “తగ్గిన దిగుమతి సుంకంతో కూడా, భారతదేశంతో పోలిస్తే ఒమన్లో బంగారం దాదాపు 5 శాతం తక్కువ ధరకే ఉంటుంది. ఈ దిగుమతి సుంకం తగ్గింపు ఒమన్లో బంగారం మరియు నగల కొనుగోళ్లను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.’’ అని మలబార్ గోల్డ్ & డైమండ్స్లో ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ షామ్లాల్ అహమ్మద్ తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







