ముంబైలో మరో అద్భుతం..సుదీర్ఘ భూగర్భ మెట్రోరైల్ ప్రారంభం
- July 25, 2024
ముంబై: ముంబైలో తొలిభూగర్భ మెట్రో రైలు పరుగులు తీసింది. ముంబై వాసులు ఏళ్ల నిరీక్షణకు బుధవారంతో తెరపడింది. తొలి సర్వీసు పరుగులు తీసింది. దీనికి ఆక్వా లైన్ అని పేరుపెట్టారు. మొదటి దశలో ఇది శాంటాక్రూజ్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్ పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ (సీపడ్) నుంచి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) వరకు నడుస్తుంది. 39.5కి.మీ. పొడవైన ఈ మార్గాన్ని కొలాబా-బాంద్రా-ఎస్ఐపిజడ్ లైన్ అని కూడా పిలుస్తారు. మెట్రోరైళ్లు గరిష్టంగా గంటకు 90 కి. మీ. వేగంతో దూసుకెళ్తాయని, 35 కిలోమీటర్ల ప్రయాణం 50 నిముషాల్లోనే పూర్తవుతుందని అధికారులు తెలిపారు. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే దాదాపు రెండు గంటలు పడుతుంది. తొలి అండర్ గ్రౌండ్ మెట్రో రైల్ సేవలతో ముంబై వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరడంతోపాటు, విలువైన సమయం కూడా ఆదా కానుంది. ఈ మార్గం నిర్మాణ పనులు 2017లో ప్రారంభమయ్యాయి. ఆరే కాలనీ నుంచి పరేడ్ వరకు ఈ మార్గంలో ముంబై మెట్రో 27 స్టేషన్లను కవర్ చేస్తుంది. కఫ్ పరేడ్, విధాన్ భవన్, చర్చ్ గేట్, మహాత్మా చౌక్, సీఎస్టీ మెట్రో, కల్బాదేవి, గిర్గావ్, గ్రాంట్ రోడ్, ముంబై సెంట్రల్ మెట్రో, మహాలక్ష్మి, సైన్స్ మ్యూజియం, డొమెస్టిక్ ఎయిర్ పోర్టు తదితర స్టేషన్ ల మీదుగా పరుగులు తీస్తుంది. ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రైలు సేవలు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









