రెండో విడత పంటరుణాల మాఫీ నిధుల విడుదల
- July 30, 2024
హైదరాబాద్: రెండో విడత పంట రుణాల మాఫీ నిధులు మంగళవారం విడుదలయ్యాయి. మొదటి దఫాలో రూ.1 లక్ష లోపు రుణాలు మాఫీ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈసారి రూ.లక్షన్నర లోపు ఉన్న రుణాలను మాఫీ చేసింది. ఈ నిధులను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.
లక్ష నుంచి లక్షన్నర రూపాయల లోపు రుణాలను ఇప్పుడు మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రెండో విడతలో 6.4 లక్షల మంది రైతులకు రూ. 6,190 కోట్లు జమ చేసినట్లు తెలిపింది. తొలి విడతలో 11.34 లక్షల మంది రైతులకు రూ.6,035 కోట్లు జమ చేశారు. రుణమాఫీ ద్వారా ఇప్పటి వరకు 17.75 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరినట్లు ప్రభుత్వం పేర్కొంది. రెండు దశల్లో కలిపి రైతుల ఖాతాల్లో రూ. 12,225 కోట్లను జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
రెండు విడతల్లో కలిసి అత్యధికంగా నల్గొండ జిల్లాలోని 1,37,430 మంది రైతులకు రూ.984.34 కోట్లు విడుదల చేశారు. ఆ తర్వాత స్థానంలో 80,395 మంది రైతులకు లబ్ధి చేకూరడం ద్వారా నాగర్ కర్నూల్ రెండో స్థానంలో ఉంది. ఈ జిల్లాకు రూ.583.87 కోట్లు విడుదల చేశారు. సంగారెడ్డి జిల్లాలో 77,951 మంది లబ్ది పొందారు. ఈ జిల్లాకు రూ. 563.99 కోట్ల నిధులు విడుదలయ్యాయి. చివరి మూడు స్థానాల్లో ములుగు (17,788 మంది రైతులకు రూ. 130.94 కోట్లు), మేడ్చల్ మల్కాజ్గిరి (2,799 మంది రైతులకు రూ.15.56 కోట్లు), హైదరాబాద్ ఉన్నాయి. హైదరాబాద్లో మొదటి విడతలో ముగ్గురు, రెండో విడతలో నలుగురు రైతులకు లబ్ధి చేకూరింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







