ఈ సంవత్సరం మరో 12 ఎయిర్పోర్టుల ప్రారంభం: మోడీ సర్కార్
- July 30, 2024
ఈ సంవత్సరం అదనంగా 12 ఎయిర్పోర్టులను ప్రారంభించాలని కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇవన్నీ UDAN పథకంలో భాగంగా నిర్మితమవుతున్నాయి. ఇవి 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రారంభమవుతాయని తెలిసింది. ఈ ఎయిర్పోర్టులు వస్తే.. ప్రాంతీయ కనెక్టివిటీ పెరుగుతుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో 85 ఎయిర్పోర్టులు ఉన్నాయి. వీటి ద్వారా 579 రూట్లకు కనెక్టివిటీ ఉంది. ఈ ఎయిర్పోర్టుల్లో 13 హెలిపాడ్స్, 2 వాటర్ ఎయిరోడ్రోమ్స్ కూడా ఉన్నాయి. వీటన్నింటినీ 2016 నుంచి ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ (UDAN) పథకంలో భాగంగా నిర్వహిస్తున్నారు.
ఈ అంశంపై సోమవారం రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు పౌర విమానయాన శాఖ మంత్రి మురళీధర్ మోహోల్. ఉడాన్ పథకాన్ని కొనసాగిస్తున్నామనీ, ఎప్పటికప్పుడు బిడ్డింగ్ ప్రక్రియ జరుపుతూ.. కొత్త ఎయిర్పోర్టులూ, రూట్లు వచ్చేలా చేస్తున్నట్లు తెలిపారు. చాలా ఎయిర్పోర్టులను సరికొత్తగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు.
ఈ సంవత్సరం కొత్తగా వచ్చే 12 ఎయిర్పోర్టులు.. ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్, మధ్యప్రదేశ్లోని రేవా, దాతియా, మహారాష్ట్రలోని అమరావతి, సోలాపూర్, డామన్ డయ్యూలోని డామన్, హర్యానాలోని అంబాలా, ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్, శహరాన్పూర్, తమిళనాడులోని వెల్లూర్, నైవేలీ, అండమాన్ నికోబార్ లోని శివపూర్, కార్ నికోబార్లో రానున్నాయి. ఇండియాలో ఎయిర్పోర్టులను తీర్చి దిద్దేందుకు తొలి దశలో రూ.4,500 కోట్లు కేటాయించగా, రెండో దశలో రూ.1,000 కోట్లు కేటాయించారు.
ఇండియాలో ఇటు రైల్వేగానీ, అటు ఎయిర్పోర్టులు గానీ ఇంకా అభివృద్ధి చెందాల్సింది చాలా ఉంది. జపాన్, చైనా లాంటి దేశాల్లో విమానాలతో పోటీ పడి రైళ్లు పరుగులు పెడుతున్నాయి. అక్కడ ఎయిర్పోర్టుల్లో బోర్డింగ్ టైమ్ వేస్ట్ అవుతుంది, అదే రైల్వేస్టేషన్లలో ఆ పరిస్థితి లేదు. అందువల్ల ఆ దేశాల్లో ప్రజలు.. విమానాల కంటే రైళ్లలో వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. లాంగ్ డిస్టాన్స్ అయితే మాత్రం విమానాల్లో వెళ్తున్నారు. ఇండియాలో విమానయాన రంగంలో ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉంది. వెంటనే ప్రయాణించేందుకు వీలుగా ఉండేలా, కొత్త ఎయిర్పోర్టుల సంఖ్యను బాగా పెంచాలని నిపుణులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







