కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు KD 150 ఫైన్

- July 31, 2024 , by Maagulf
కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు KD 150 ఫైన్

కువైట్: పెరుగుతున్న ప్రమాదాలను తగ్గించడానికి, చట్టాలను ఉల్లంఘించిన వారికి అధిక జరిమానాలతో కూడిన కొత్త ట్రాఫిక్ చట్టాన్ని అంతర్గత మంత్రిత్వ శాఖ ఖరారు చేస్తోందని మంత్రిత్వ శాఖలోని ఒక ఉన్నత అధికారి తెలిపారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు ప్రస్తుతం ఉన్న KD 30 జరిమానా..  కొత్త చట్టంలో KD 150గా ఉంటుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పబ్లిక్ రిలేషన్స్ హెడ్ బ్రిగ్ నాజర్ బుస్లైబ్ తెలిపారు. రెడ్ ట్రాఫిక్ లైట్‌ జంప్ కు జరిమానా 50 KD నుండి KD 150కి మూడు రెట్లు పెరుగుతుందని ఆయన తెలిపారు. చట్టాన్ని అధికారులు ఖరారు చేస్తున్నారని, అయితే దానిని అమలు చేయడానికి నిర్దిష్ట తేదీని స్పష్టం చేయలేదని ఆయన వివరించారు.

30 ఏళ్లుగా కువైట్ ట్రాఫిక్ చట్టాన్ని సవరించలేదని, ప్రస్తుతం ఏటా 300 నుంచి 400 వరకు ట్రాఫిక్ ప్రమాదాల వల్ల మరణాలు సంభవిస్తున్నాయని, వీరిలో ఎక్కువ మంది 18-30 ఏళ్ల మధ్య వయస్కులేనని బుస్లైబ్ చెప్పారు.  స్వాధీనం చేసుకున్న వాహనాలను అంతర్గత మంత్రిత్వ శాఖ వద్ద ఉంచకుండా ఉల్లంఘించిన వారి ఇళ్ల వద్ద ఉంచే కొత్త ప్రతిపాదనను కూడా ట్రాఫిక్ విభాగం అధ్యయనం చేస్తోందని ఆయన చెప్పారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం మరియు ఇతరుల ప్రాణాలకు హాని కలిగిస్తే సహించేది లేదని అంతర్గత మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. రహదారి వినియోగదారుల భద్రతను కాపాడేందుకు చట్టాన్ని కఠినంగా వర్తింపజేయబడుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.  అత్యవసర హాట్‌లైన్ (112) లేదా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ (99324092) యొక్క వాట్సాప్‌లో నిర్లక్ష్యంగా ఉన్న డ్రైవర్లను నివేదించమని నివాసితులను కోరింది.

కువైట్‌లో నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా 2023లో 296 మరణాలు, 50,000 ప్రమాదాలు సంభవించాయి . అయితే తొమ్మిది మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. నాలుగు మిలియన్లకు పైగా స్పీడ్ టిక్కెట్లు, 850,000 రెడ్-లైట్ జంప్ ఉల్లంఘనలు, సీటు బెల్ట్ ధరించనందుకు 300,000 జరిమానాలు, అలాగే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించినందుకు 185,000 మంది బుక్కయ్యారు. 

--దివాకర్((మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com