నకిలీ పాస్పోర్ట్.. 75 ఏళ్ల యూరోపియన్ వ్యక్తికి 3 ఏళ్ల జైలుశిక్ష
- July 31, 2024
మనామా: నకిలీ పాస్పోర్ట్ను ఉపయోగించి బహ్రెయిన్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినందుకు 75 ఏళ్ల యూరోపియన్ వ్యక్తికి హై క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన మార్చి 22న బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది.
మొదట ఆరోపణలను తిరస్కరించిన నిందితుడు.. సమగ్ర విచారణ తర్వాత దోషిగా తేలాడు. దేశంలోకి ప్రవేశించే ప్రయత్నంలో నకిలీ ఎలక్ట్రానిక్ పత్రాన్ని, ప్రత్యేకంగా పాస్పోర్ట్ను ఉపయోగించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ అతనిపై అభియోగాలు మోపింది. విచారణలో తప్పుడు డేటాను ప్రవేశానికి ఉపయోగించినట్టు, నకిలీ పాస్పోర్ట్ను పాస్పోర్ట్ ను ఉపయోగించినట్టు అంగీకరించాడు. తదుపరి విచారణలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ నుండి వచ్చిన నివేదిక, అలాగే యూరోపియన్ ఎంబసీ నుండి వెరిఫికేషన్ ద్వారా పాస్పోర్ట్ ఫోర్జరీని నిర్ధారించారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









