నకిలీ పాస్పోర్ట్.. 75 ఏళ్ల యూరోపియన్ వ్యక్తికి 3 ఏళ్ల జైలుశిక్ష
- July 31, 2024
మనామా: నకిలీ పాస్పోర్ట్ను ఉపయోగించి బహ్రెయిన్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినందుకు 75 ఏళ్ల యూరోపియన్ వ్యక్తికి హై క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన మార్చి 22న బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది.
మొదట ఆరోపణలను తిరస్కరించిన నిందితుడు.. సమగ్ర విచారణ తర్వాత దోషిగా తేలాడు. దేశంలోకి ప్రవేశించే ప్రయత్నంలో నకిలీ ఎలక్ట్రానిక్ పత్రాన్ని, ప్రత్యేకంగా పాస్పోర్ట్ను ఉపయోగించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ అతనిపై అభియోగాలు మోపింది. విచారణలో తప్పుడు డేటాను ప్రవేశానికి ఉపయోగించినట్టు, నకిలీ పాస్పోర్ట్ను పాస్పోర్ట్ ను ఉపయోగించినట్టు అంగీకరించాడు. తదుపరి విచారణలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ నుండి వచ్చిన నివేదిక, అలాగే యూరోపియన్ ఎంబసీ నుండి వెరిఫికేషన్ ద్వారా పాస్పోర్ట్ ఫోర్జరీని నిర్ధారించారు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







