నకిలీ పాస్పోర్ట్.. 75 ఏళ్ల యూరోపియన్ వ్యక్తికి 3 ఏళ్ల జైలుశిక్ష
- July 31, 2024
మనామా: నకిలీ పాస్పోర్ట్ను ఉపయోగించి బహ్రెయిన్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినందుకు 75 ఏళ్ల యూరోపియన్ వ్యక్తికి హై క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన మార్చి 22న బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది.
మొదట ఆరోపణలను తిరస్కరించిన నిందితుడు.. సమగ్ర విచారణ తర్వాత దోషిగా తేలాడు. దేశంలోకి ప్రవేశించే ప్రయత్నంలో నకిలీ ఎలక్ట్రానిక్ పత్రాన్ని, ప్రత్యేకంగా పాస్పోర్ట్ను ఉపయోగించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ అతనిపై అభియోగాలు మోపింది. విచారణలో తప్పుడు డేటాను ప్రవేశానికి ఉపయోగించినట్టు, నకిలీ పాస్పోర్ట్ను పాస్పోర్ట్ ను ఉపయోగించినట్టు అంగీకరించాడు. తదుపరి విచారణలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ నుండి వచ్చిన నివేదిక, అలాగే యూరోపియన్ ఎంబసీ నుండి వెరిఫికేషన్ ద్వారా పాస్పోర్ట్ ఫోర్జరీని నిర్ధారించారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







