కిడ్నీ సమస్యల్ని ముందుగానే గుర్తించడమెలా.?
- July 31, 2024
శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. కిడ్నీలు సక్రమంగా పని చేస్తేనే శరీరమంతా ఆరోగ్యంగా వుంటుంది. శరీరంలోని వ్యర్ధాల్ని తొలిగించడంలో కిడ్నీల పాత్ర కీలకమైనది.
కిడ్నీల పని తీరు సక్రమంగా లేనట్లయితే శరీరంలోని వ్యర్ధాలు పేరుకుపోయి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయ్. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతక ప్రమాదం కూడా సంభవించొచ్చు.
అందుకే కిడ్నీ సమస్యల్ని అస్సలు అశ్రద్ధ చేయరాదని నిపుణులు చెబుతున్నారు. మరి కిడ్నీ సమస్యల్ని ముందుగానే గుర్తించడమెలా.? ముఖ్యంగా కిడ్నీ సమస్యలుంటే కాళ్లలో నొప్పులు మొదలవడం ప్రాధమిక లక్షణంగా చెబుతున్నారు.
కిడ్నీ సమస్యలుంటే కాలి చీల మండలు ముందుగా ప్రభావితం అవుతాయ్. కాలి చీల మండల్లో వాపులు రావడం నొప్పులు, తుంటి కీళ్ల నొప్పులు, పొత్తి కడుపులో నొప్పి తదితర సమస్యలు లక్షణాలుగా గుర్తించాలి.
అలాగే, అజీర్ణం, మూత్ర విసర్ఝనలో ఇబ్బంది, మూత్రంలో రక్తం పడడం వంటి లక్షణాలు సైతం కిడ్నీ సమస్యలకు లక్షణాలుగా చెబుతున్నారు.
నిద్రపోయి లేచిన వెంటనే కాళ్లలో విపరీతమైన నొప్పి, అడుగు నేలపై పెట్టలేకపోవడం కూడా కిడ్నీ సమస్యల్లో చెప్పుకోదగ్గ లక్షణంగా సూచిస్తున్నారు. తక్కువ దూరం కూడా నడవలేకపోవడం, ఎక్కువ సేపు నిలబడలేకపోవడం.. తదితర లక్షణాలు కిడ్నీ సమస్యలను సూచించేవే. సో, ఈ లక్షణాలుంటే ముందుగానే అలర్ట్ అవ్వాలనీ, వైద్యుని సలహాతో తగు చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







