కిడ్నీ సమస్యల్ని ముందుగానే గుర్తించడమెలా.?
- July 31, 2024
శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. కిడ్నీలు సక్రమంగా పని చేస్తేనే శరీరమంతా ఆరోగ్యంగా వుంటుంది. శరీరంలోని వ్యర్ధాల్ని తొలిగించడంలో కిడ్నీల పాత్ర కీలకమైనది.
కిడ్నీల పని తీరు సక్రమంగా లేనట్లయితే శరీరంలోని వ్యర్ధాలు పేరుకుపోయి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయ్. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతక ప్రమాదం కూడా సంభవించొచ్చు.
అందుకే కిడ్నీ సమస్యల్ని అస్సలు అశ్రద్ధ చేయరాదని నిపుణులు చెబుతున్నారు. మరి కిడ్నీ సమస్యల్ని ముందుగానే గుర్తించడమెలా.? ముఖ్యంగా కిడ్నీ సమస్యలుంటే కాళ్లలో నొప్పులు మొదలవడం ప్రాధమిక లక్షణంగా చెబుతున్నారు.
కిడ్నీ సమస్యలుంటే కాలి చీల మండలు ముందుగా ప్రభావితం అవుతాయ్. కాలి చీల మండల్లో వాపులు రావడం నొప్పులు, తుంటి కీళ్ల నొప్పులు, పొత్తి కడుపులో నొప్పి తదితర సమస్యలు లక్షణాలుగా గుర్తించాలి.
అలాగే, అజీర్ణం, మూత్ర విసర్ఝనలో ఇబ్బంది, మూత్రంలో రక్తం పడడం వంటి లక్షణాలు సైతం కిడ్నీ సమస్యలకు లక్షణాలుగా చెబుతున్నారు.
నిద్రపోయి లేచిన వెంటనే కాళ్లలో విపరీతమైన నొప్పి, అడుగు నేలపై పెట్టలేకపోవడం కూడా కిడ్నీ సమస్యల్లో చెప్పుకోదగ్గ లక్షణంగా సూచిస్తున్నారు. తక్కువ దూరం కూడా నడవలేకపోవడం, ఎక్కువ సేపు నిలబడలేకపోవడం.. తదితర లక్షణాలు కిడ్నీ సమస్యలను సూచించేవే. సో, ఈ లక్షణాలుంటే ముందుగానే అలర్ట్ అవ్వాలనీ, వైద్యుని సలహాతో తగు చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు.
తాజా వార్తలు
- వ్యాపారి ఇంట్లో భారీ చోరీ కేసులో మిస్టరీని ఛేదించిన హైదరాబాద్ పోలీస్
- రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు!
- మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్..ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి
- రోడ్ల విషయమై మంత్రి గడ్కరి ని కలిసిన ఎంపీ బాల శౌరి
- దుబాయ్ లో ది లూప్ ప్రాజెక్ట్..ఎలోన్ మస్క్ తో ఒప్పందం..!!
- కువైట్లో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు..!!
- ఎడారి ప్రాంతాల్లో ఉల్లంఘనలపై కేసులు నమోదు..తనిఖీలు ప్రారంభం..!!
- రియాద్ వేదికగా డిసెంబర్లో గ్లోబల్ ఎయిర్పోర్ట్స్ ఫోరమ్..!!
- ఘోర ప్రమాదం..గ్యాస్ పేలుడుతో కుప్పకూలిన భవనం..!!
- ఫిబ్రవరి 16న మస్కట్లో హిందూ మహాసముద్ర సదస్సు..!!