పతాకం రక్షణ బాధ్యతలు హెచ్‌ఎండీఏకు

- June 15, 2016 , by Maagulf
పతాకం రక్షణ బాధ్యతలు హెచ్‌ఎండీఏకు

దేశ చరిత్రలోనే అత్యంత భారీ జాతీయ పతాకం రక్షణ బాధ్యతలు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు అప్పగిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. హుస్సేన్‌సాగర్ తీరప్రాంతమైన సంజీవయ్యపార్కులో 291 ఫీట్ల ఎత్తు, 40 మీటర్ల మందం స్తంభంపై .. 72 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పుతో ఆవిష్కృతమైన మువ్వన్నెల జాతీయ జెండా తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంది. సంజీవయ్యపార్క్ హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండడం, జెండా నిర్వహణ బాధ్యతలు సైతం హెచ్‌ఎండీఏ చూడాలంటూ ఆర్‌అండ్‌బీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈ జెండా నిర్వహణ బాధ్యతలు ఇకపై హెచ్‌ఎండీఏ కంటికి రెప్పలా చూడాల్సి ఉంటుంది. అయితే, గాలిదుమారంతో జాతీయ జెండా గౌరవానికి భంగం కలుగకుండా చూడడం, ఏదైనా ఇబ్బందులు తలెత్తితే డేగకన్నువే యాల్సి ఉంటుంది.


ప్రధానంగా రాత్రి సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్వహణకు ప్రత్యేక సిబ్బందితోపాటు లైటింగ్ ఇతర పనులపై పర్యవేక్షణ తప్పనిసరి. అయితే, ఈ భారీ జెండా నిర్వహణ బాధ్యతలు ఏడాదికి దాదాపు రూ. 50 నుంచి 60 లక్షల మేర ఖర్చు అవుతుందని హెచ్‌ఎండీఏ ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ నిర్వహణ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తూనే పార్కు లో సందర్శకులను ఆకట్టుకునేలా సుందరీకరణ పనులు చేపట్టి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు. కాగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహణ బాధ్యతలను హెచ్‌ఎండీఏ రెండు రోజుల్లో తీసుకోనున్నట్లు తెలిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com