.కొత్త సరుకు రవాణా రైలు..

- June 15, 2016 , by Maagulf
.కొత్త సరుకు రవాణా రైలు..

హైదరాబాద్‌-చెన్నై రేవుల మధ్య ఎగుమతి, దిగుమతి సరుకులను రవాణా చేయడానికి ఉద్దేశించిన...కొత్త సరుకు రవాణా రైలును దక్షిణమధ్యరైల్వే జనరల్‌ మేనేజర్‌ రవీంద్రగుప్తా బుధవారం... తిమ్మాపూర్‌ టెర్మినల్‌ స్లైడింగ్‌ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. ఇది వారానికి ఒక రోజు నడుస్తుంది. పరిశ్రమల అవసరాలతోపాటు హైదరాబాద్‌ మార్కెట్‌, దాని చుట్టుపక్కల జిల్లాలు... మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, మెదక్‌, వరంగల్‌, నల్గొండ జిల్లాలతోపాటు... గుంటూరు జిల్లా అవసరాలకు అనుగుణంగా ఇది ఉపయోగపడుతుంది. మందులు, ఇంజినీరింగ్‌ సామగ్రి, ఆటోమొబైల్‌, జౌళి, శుద్ధి చేసిన ఆహారపదార్థాలు, గ్రానైట్‌, ముడిసరుకులు, రసాయనాల ఎగుమతి, దిగుమతి సరుకులను ఈ రైలు చేరవేస్తుంది.
ఈ కార్యక్రమంలో చీఫ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ ఎన్‌.మధుసూదనరావు, హైదరాబాద్‌ డీఆర్‌ఎం అరుణాసింగ్‌, డిసి్ట్రబ్యూషన్‌ లాజిస్టిక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జె.సత్యనాథన్‌ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com