.కొత్త సరుకు రవాణా రైలు..
- June 15, 2016
హైదరాబాద్-చెన్నై రేవుల మధ్య ఎగుమతి, దిగుమతి సరుకులను రవాణా చేయడానికి ఉద్దేశించిన...కొత్త సరుకు రవాణా రైలును దక్షిణమధ్యరైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా బుధవారం... తిమ్మాపూర్ టెర్మినల్ స్లైడింగ్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. ఇది వారానికి ఒక రోజు నడుస్తుంది. పరిశ్రమల అవసరాలతోపాటు హైదరాబాద్ మార్కెట్, దాని చుట్టుపక్కల జిల్లాలు... మహబూబ్నగర్, రంగారెడ్డి, మెదక్, వరంగల్, నల్గొండ జిల్లాలతోపాటు... గుంటూరు జిల్లా అవసరాలకు అనుగుణంగా ఇది ఉపయోగపడుతుంది. మందులు, ఇంజినీరింగ్ సామగ్రి, ఆటోమొబైల్, జౌళి, శుద్ధి చేసిన ఆహారపదార్థాలు, గ్రానైట్, ముడిసరుకులు, రసాయనాల ఎగుమతి, దిగుమతి సరుకులను ఈ రైలు చేరవేస్తుంది.
ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఎన్.మధుసూదనరావు, హైదరాబాద్ డీఆర్ఎం అరుణాసింగ్, డిసి్ట్రబ్యూషన్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జె.సత్యనాథన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







