వీసా క్షమాభిక్ష: నకిలీ 'రిజిస్ట్రేషన్ వెబ్సైట్ల'పై హెచ్చరిక
- August 07, 2024
యూఏఈ: యూఏఈలోని ఫిలిప్పీన్స్ మిషన్లు సెప్టెంబర్ 1న ప్రారంభం కానున్న రాబోయే వీసా క్షమాభిక్షపై తప్పుదారి పట్టించే సమాచారాన్ని ఇస్తున్న నకిలీ వెబ్సైట్ల గురించి తమ దేశస్థులను హెచ్చరించాయి. ఫిలిప్పీన్ ఎంబసీ "క్షమాభిక్ష నమోదు కోసం పోర్టల్గా ఫేక్ సైట్లకు లింక్లను పంపుతున్న బోగస్ టెక్స్ట్ సందేశాలు, ఇ-మెయిల్ల గురించి భయంకరమైన నివేదికలు అందాయని" తెలిపింది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరింది. ధృవీకరించబడిన సైట్లకు మాత్రమే మీ వ్యక్తిగత సమాచారం వివరాలను ఇవ్వాలని సూచించింది. రెండు నెలల వీసా క్షమాభిక్ష కార్యక్రమం నిర్వహణపై ఎమిరేట్ ప్రభుత్వం ఇంకా వివరాలను విడుదల చేయలేదని పేర్కొంది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ICP) మరియు సంబంధిత ఏజెన్సీలతో రాయబార కార్యాలయం సమన్వయాన్ని కొనసాగిస్తుందని తెలిపింది. 2007లో దాదాపు 342,000 మంది నివాసితులు క్షమాభిక్షను ఉపయోగింకోరుకున్నారుచుకున్నారు. 2012/2013లో, 60,000 కంటే ఎక్కువ మంది వలసదారులు ఉపయోగించుకున్నారు. 2018లో దుబాయ్లో మొత్తం 105,809 మంది నివాస వీసా ఉల్లంఘించినవారు క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారని GDRFA తెలిపింది. డిసెంబర్ 31, 2018న ముగిసిన ఐదు నెలల పథకంలో మిలియన్ల దిర్హామ్లు జరిమానాలు రద్దు చేయబడ్డాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి