వీసా క్షమాభిక్ష: నకిలీ 'రిజిస్ట్రేషన్ వెబ్సైట్ల'పై హెచ్చరిక
- August 07, 2024
యూఏఈ: యూఏఈలోని ఫిలిప్పీన్స్ మిషన్లు సెప్టెంబర్ 1న ప్రారంభం కానున్న రాబోయే వీసా క్షమాభిక్షపై తప్పుదారి పట్టించే సమాచారాన్ని ఇస్తున్న నకిలీ వెబ్సైట్ల గురించి తమ దేశస్థులను హెచ్చరించాయి. ఫిలిప్పీన్ ఎంబసీ "క్షమాభిక్ష నమోదు కోసం పోర్టల్గా ఫేక్ సైట్లకు లింక్లను పంపుతున్న బోగస్ టెక్స్ట్ సందేశాలు, ఇ-మెయిల్ల గురించి భయంకరమైన నివేదికలు అందాయని" తెలిపింది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరింది. ధృవీకరించబడిన సైట్లకు మాత్రమే మీ వ్యక్తిగత సమాచారం వివరాలను ఇవ్వాలని సూచించింది. రెండు నెలల వీసా క్షమాభిక్ష కార్యక్రమం నిర్వహణపై ఎమిరేట్ ప్రభుత్వం ఇంకా వివరాలను విడుదల చేయలేదని పేర్కొంది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ICP) మరియు సంబంధిత ఏజెన్సీలతో రాయబార కార్యాలయం సమన్వయాన్ని కొనసాగిస్తుందని తెలిపింది. 2007లో దాదాపు 342,000 మంది నివాసితులు క్షమాభిక్షను ఉపయోగింకోరుకున్నారుచుకున్నారు. 2012/2013లో, 60,000 కంటే ఎక్కువ మంది వలసదారులు ఉపయోగించుకున్నారు. 2018లో దుబాయ్లో మొత్తం 105,809 మంది నివాస వీసా ఉల్లంఘించినవారు క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారని GDRFA తెలిపింది. డిసెంబర్ 31, 2018న ముగిసిన ఐదు నెలల పథకంలో మిలియన్ల దిర్హామ్లు జరిమానాలు రద్దు చేయబడ్డాయి.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







