తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక..
- August 09, 2024
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమల అంగ ప్రదక్షిణ టోకెన్ల ఆన్ లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శుక్రవారం విడుదల చేయనుంది. ఆగస్ట్ పదో తేదీకి సంబంధించిన మొత్తం 250 అంగ ప్రదక్షిణ టోకెన్లను ఆగస్టు 09 మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో అంగప్రదక్షిణం టోకెన్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. మరోవైపు అంగప్రదక్షిణ చేసే సమయంలో భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలను ధరించాల్సి ఉంటుంది. తిరుమల శ్రీవారి బంగారు వాకిలి ముందు నుంచి సాష్టాంగ నమస్కారం చేస్తూ.. శ్రీవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ హుండీ వరకూ చేరుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అంగ ప్రదక్షిణ పూర్తి అయినట్లు చెప్తారు. మరోవైపు సుప్రభాత సేవ మొదలైన తరవాత.. అంగప్రదక్షిణకు అనుమతిస్తారు.
మరోవైపు బుధవారం 75 వేల 109 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 30 వేల 285 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీకి రూ.3 కోట్ల 40 లక్షలు ఆదాయం వచ్చినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. సర్వదర్శనానికి 8 గంటల సమయం పట్టినట్లు తెలిపింది. అయితే వీకెండ్ సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ









