తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక..
- August 09, 2024
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమల అంగ ప్రదక్షిణ టోకెన్ల ఆన్ లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శుక్రవారం విడుదల చేయనుంది. ఆగస్ట్ పదో తేదీకి సంబంధించిన మొత్తం 250 అంగ ప్రదక్షిణ టోకెన్లను ఆగస్టు 09 మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో అంగప్రదక్షిణం టోకెన్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. మరోవైపు అంగప్రదక్షిణ చేసే సమయంలో భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలను ధరించాల్సి ఉంటుంది. తిరుమల శ్రీవారి బంగారు వాకిలి ముందు నుంచి సాష్టాంగ నమస్కారం చేస్తూ.. శ్రీవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ హుండీ వరకూ చేరుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అంగ ప్రదక్షిణ పూర్తి అయినట్లు చెప్తారు. మరోవైపు సుప్రభాత సేవ మొదలైన తరవాత.. అంగప్రదక్షిణకు అనుమతిస్తారు.
మరోవైపు బుధవారం 75 వేల 109 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 30 వేల 285 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీకి రూ.3 కోట్ల 40 లక్షలు ఆదాయం వచ్చినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. సర్వదర్శనానికి 8 గంటల సమయం పట్టినట్లు తెలిపింది. అయితే వీకెండ్ సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







