తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక..
- August 09, 2024
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమల అంగ ప్రదక్షిణ టోకెన్ల ఆన్ లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శుక్రవారం విడుదల చేయనుంది. ఆగస్ట్ పదో తేదీకి సంబంధించిన మొత్తం 250 అంగ ప్రదక్షిణ టోకెన్లను ఆగస్టు 09 మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో అంగప్రదక్షిణం టోకెన్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. మరోవైపు అంగప్రదక్షిణ చేసే సమయంలో భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలను ధరించాల్సి ఉంటుంది. తిరుమల శ్రీవారి బంగారు వాకిలి ముందు నుంచి సాష్టాంగ నమస్కారం చేస్తూ.. శ్రీవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ హుండీ వరకూ చేరుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అంగ ప్రదక్షిణ పూర్తి అయినట్లు చెప్తారు. మరోవైపు సుప్రభాత సేవ మొదలైన తరవాత.. అంగప్రదక్షిణకు అనుమతిస్తారు.
మరోవైపు బుధవారం 75 వేల 109 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 30 వేల 285 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీకి రూ.3 కోట్ల 40 లక్షలు ఆదాయం వచ్చినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. సర్వదర్శనానికి 8 గంటల సమయం పట్టినట్లు తెలిపింది. అయితే వీకెండ్ సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?







