ఆగస్టు 12న ఖతార్లో గరిష్ట స్థాయికి 'పెర్సీడ్’..!
- August 10, 2024
దోహా: అత్యంత అద్భుతమైన ఖగోళ ప్రదర్శనలలో ఒకటిగా పిలువబడే పెర్సీడ్ ఉల్కాపాతం ఖతార్లో సెప్టెంబర్ 1 వరకు కనిపిస్తుంది.ఆగస్టు 12 న గరిష్ట స్థాయికి చేరుకుంటుందని దోహాకు చెందిన ఖగోళ ఫోటోగ్రాఫర్ మరియు ఎవరెస్టర్ అబ్జర్వేటరీ వ్యవస్థాపకుడు అజిత్ ఎవరెస్టర్ తెలిపారు. ఈ పీక్ రాత్రులలో పెర్సీడ్ ఉల్కాపాతం ప్రకాశవంతమైన పాయింట్ సుమారు రాత్రి 8 గంటలకు పీక్ స్టేజ్ కి చేరుకుంటుందని తెలిపారు. ప్రధాన వీక్షణ సమయం చంద్రాస్తమయం తర్వాత ప్రారంభమవుతుంది మరియు ఉదయం 3:45 గంటలకు వరకు కొనసాగుతుంది.
టెలిస్కోప్లు లేదా బైనాక్యులర్ల అవసరం లేకుండా పెర్సీడ్ ఉల్కాపాతాన్ని కంటితో ఆస్వాదించవచ్చని ఖతార్లోని ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్త నవీన్ ఆనంద్ వెల్లడించారు. "ఖతార్లో కాంతి కాలుష్యం మరియు ఇతర కారకాల కారణంగా, గరిష్టంగా గంటకు 60 నుండి 80 ఉల్కల రేటును మేము అంచనా వేస్తున్నాము" అని ఆనంద్ చెప్పారు. ఈ ఖగోళ సంఘటనను చూసేందుకు ఆసక్తిగా ఉన్నవారి కోసం ఖతార్ స్పేస్ మినిస్ట్రీ, స్పేస్ క్లబ్, ఎవరెస్టర్ అబ్జర్వేటరీతో కలిసి ఆగస్టు 12న అల్ ఖర్రారాలో ఒక పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. పాల్గొనేవారు ఈవెంట్ మార్గదర్శకాల కోసం అజిత్ ఎవరెస్టర్ లేదా నవీన్ ఆనంద్ను వాట్సాప్ ద్వారా వరుసగా 55482045 మరియు 30889582లో సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!









