మళ్లీ కోరలు చాస్తున్న కరోనా!
- August 11, 2024
జెనీవా: కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దాదాపు 84 దేశాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ..డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఆగస్టు రెండు వారాల్లో కేసుల సంఖ్య సాధారణం కంటే 20 శాతం పెరిగిందని తెలిపింది.
అంతేకాకుండా, పారిస్ ఒలింపిక్స్లో 40 మంది అథ్లెట్లు కరోనాకు సంబంధించిన శ్వాసకోశ వ్యాధుల బారిన పడ్డారని వెల్లడించారు.జెనీవాలో డబ్ల్యూహెచ్ఓ డాక్టర్ వాన్ కెర్ఖోవ్ నిర్వహించిన ప్రెస్ మీట్లో కోవిడ్ పరీక్షలు చేస్తే 10 శాతం పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. ఈసారి తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమె అన్నారు. ఇక అమెరికా, యూరప్, పశ్చిమ పసిఫిక్లో కొత్త ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయిని తెలిపింది. గత 18 నెలల్లో కోవిడ్ వ్యాక్సిన్ల లభ్యత కూడా గణనీయంగా తగ్గిందని డాక్టర్ వాన్ కెర్ఖోవ్ తెలిపారు. ఈసారి కోవిడ్-19ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోవాలని దేశాలు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









