మళ్లీ కోరలు చాస్తున్న కరోనా!
- August 11, 2024
జెనీవా: కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దాదాపు 84 దేశాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ..డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఆగస్టు రెండు వారాల్లో కేసుల సంఖ్య సాధారణం కంటే 20 శాతం పెరిగిందని తెలిపింది.
అంతేకాకుండా, పారిస్ ఒలింపిక్స్లో 40 మంది అథ్లెట్లు కరోనాకు సంబంధించిన శ్వాసకోశ వ్యాధుల బారిన పడ్డారని వెల్లడించారు.జెనీవాలో డబ్ల్యూహెచ్ఓ డాక్టర్ వాన్ కెర్ఖోవ్ నిర్వహించిన ప్రెస్ మీట్లో కోవిడ్ పరీక్షలు చేస్తే 10 శాతం పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. ఈసారి తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమె అన్నారు. ఇక అమెరికా, యూరప్, పశ్చిమ పసిఫిక్లో కొత్త ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయిని తెలిపింది. గత 18 నెలల్లో కోవిడ్ వ్యాక్సిన్ల లభ్యత కూడా గణనీయంగా తగ్గిందని డాక్టర్ వాన్ కెర్ఖోవ్ తెలిపారు. ఈసారి కోవిడ్-19ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోవాలని దేశాలు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







