శరవేగంగా భోగాపురం ఏయిర్పోర్ట్ పనులు
- August 11, 2024
అమరావతి: ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే శక్తి భోగాపురం విమానాశ్రయానికి ఉందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో చేపడుతున్న విమానాశ్రయ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయని… ఇప్పటి వరకు 36.6 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు.
లనిర్ణీత గడువు కంటే ముందే పనులు పూర్తి చేస్తామన్నారు. జూన్ 2026 నాటికి ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ప్రతినెల ఎయిర్పోర్ట్ పనులను పరిశీలించి వేగవంతం చేస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఇక ఉడాన్ పథకంతో మన దేశ విమానయాన రంగం ప్రపంచంలోనే అత్యుత్తమంగా మారిందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఓర్వకల్లు, దగదర్తి, నాగార్జునసాగర్, కుప్పంలో కూడా విమానాశ్రయాలను త్వరలో నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణలోనూ కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలను త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు.
--సాగర్ కర్రి(మాగల్ఫ్ ప్రతినిధి,అమరావతి)
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







