శరవేగంగా భోగాపురం ఏయిర్పోర్ట్ పనులు
- August 11, 2024
అమరావతి: ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే శక్తి భోగాపురం విమానాశ్రయానికి ఉందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో చేపడుతున్న విమానాశ్రయ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయని… ఇప్పటి వరకు 36.6 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు.
లనిర్ణీత గడువు కంటే ముందే పనులు పూర్తి చేస్తామన్నారు. జూన్ 2026 నాటికి ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ప్రతినెల ఎయిర్పోర్ట్ పనులను పరిశీలించి వేగవంతం చేస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఇక ఉడాన్ పథకంతో మన దేశ విమానయాన రంగం ప్రపంచంలోనే అత్యుత్తమంగా మారిందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఓర్వకల్లు, దగదర్తి, నాగార్జునసాగర్, కుప్పంలో కూడా విమానాశ్రయాలను త్వరలో నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణలోనూ కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలను త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు.
--సాగర్ కర్రి(మాగల్ఫ్ ప్రతినిధి,అమరావతి)
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









